AP Crime: పల్నాడులో భగ్గుమన్న పాత కక్షలు.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య!

పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో బొడ్రాయి దగ్గర ఒకరిని, అదే గ్రామంలో అడిగొప్పల అమ్మవారి గుడి ప్రాంగణం వాటర్‌ప్లాంట్‌ దగ్గర మరొకరిని వేటకొడవళ్లతో నరికి చంపేశారు. వీళ్లిద్దరు టీడీపీ కార్యకర్తలు కావడంతో ఈ హత్యలు దుమారం రేపుతున్నాయి.

New Update
Two Killed from same village in Palnadu District

Two Killed from same village in Palnadu District

Two Killed From Palnadu District

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అన్నదమ్ముల హత్యల కేసు కలకలం రేపుతోంది. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో బొడ్రాయి దగ్గర అన్నను, అదే గ్రామంలో అడిగొప్పల అమ్మవారి గుడి ప్రాంగణం వాటర్‌ప్లాంట్‌ దగ్గర అతడి తమ్ముడిని వేటకొడవళ్లతో నరికి చంపేశారు. బొడ్రాయి దగ్గర చనిపోయిన వ్యక్తిని అన్న కొత్త హనుమంతుగా, అమ్మవారి గుడిదగ్గర మృతి చెందిన తమ్ముడు కొత్త శ్రీరామ్‌ మూర్తిగా గుర్తించారు. వీళ్లిద్దరు టీడీపీ కార్యకర్తలు కావడంతో ఈ హత్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read :  ఏడాదిలో రూ.751.40 కోట్లు దోచుకున్న సైబర్‌ నేరగాళ్లు

Also Read :  వాట్సాప్‌లో కొత్త మోసం.. 'ఘోస్ట్ పేయిరింగ్'తో జాగ్రత్త!

Advertisment
తాజా కథనాలు