TGSRTC: పండక్కి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్.. అదనంగా 5వేల బస్సులు

సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రజలు భారీగా వెళ్తుంటారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా 5 వేల ప్రత్యేక బస్సులను ఏపీకి నడపనున్నట్లు తెలిపింది. పది రోజుల పాటు ఈ బస్సులు నడపనున్నారు.

New Update
Hyderabad:ఆర్టీసీ బస్సులో మహిళ ఆగమాగం..కండక్టర్ ను కాలితో తన్నిన వైనం

ఏపీలో ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా కూడా తప్పకుండా ఈ పండుగకి ఇంటికి చేరుకుంటారు. ఏపీ ప్రజలు చాలా మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసించే వారు తప్పకుండా సంక్రాంతికి ఇంటికి వెళ్తారు.

ఇది కూడా చూడండి: యువతకి కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని..

బస్సులు, కార్లు, రైళ్లు ఏదో విధంగా అయిన కూడా పండగకి వెళ్లాలని అనుకుంటారు. సంక్రాంతి సమయంలో ఏ వాహనం కూడా ఖాళీ ఉండదు. దీంతో సొంతూళ్లకు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేకంగా 5 వేల బస్సులను ఏపీకి నడపనున్నట్లు తెలిపింది. 

ఇది కూడా చూడండి: Weather: రుతుపవనాల సీజన్‌ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!

జనవరి మొదటి వారం నుంచి పది రోజుల పాటు ఏపీకి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అయితే ఈ 5 వేల బస్సులు ఏయే రూట్లలో నడుస్తాయనే విషయాలు ఇంకా తెలియాలి. అలాగే బస్సు ఛార్జీలు పెంచుతున్నారా? లేకపోతే యథావిధిగానే ఉంటాయనే విషయాలు కూడా ఇంకా ఆర్టీసీ వెల్లడించలేదు. 

ఇది కూడా చూడండి:  AP: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ సెక్యూరిటీ సూర్యప్రకాష్ కథ ఇదే..

హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయనుంది. 2400 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నారు. పండగ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఏపీఎస్‌ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక బస్సులను జనవరి 9 నుంచి 13 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయని ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు