Central Jail Kadapa : జైల్లో ఖైదీలకు మొబైల్ సరఫరా.. ఐదుగురిపై  సస్పెన్షన్ వేటు

కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఐదుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ కమలాకర్‌తోపాటు..ముగ్గురు జైలు వార్డర్లను సస్పెండ్‌ చేశారు.

New Update
Central Jail Kadapa

Central Jail Kadapa

Central Jail Kadapa : కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఐదుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ కమలాకర్‌తోపాటు.. మరో ముగ్గురు జైలు వార్డర్లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇది కూడా చూడండి:Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

కడప జైల్లో ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై నాలుగు రోజులపాటు కడప జైల్లో డిఐజీ రవికిరణ్ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఐదుగురుపై సస్పెన్షన్ వేటు పడింది.  ఈ క్రమంలో విచారణలో భాగంగా ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఐదుగురిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి:Pahalgam Attack: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్‌

Advertisment
తాజా కథనాలు