Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

దాదాపు 20 ఏళ్ల క్రితం ముంబయిలో రైలు పేలుళ్ల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బాంబే హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. 2006లో జరిగిన ఈ ఘటనపై 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

New Update
2006 Mumbai train blasts, Bombay High Court acquits all 12 accused

2006 Mumbai train blasts, Bombay High Court acquits all 12 accused

దాదాపు 20 ఏళ్ల క్రితం ముంబయిలో రైలు పేలుళ్ల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బాంబే హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. 2006లో జరిగిన ఈ ఘటనపై 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. వాళ్లపై అభియోగాలు నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. ఈ కారణంతోనే నిందితులను నిర్దోషులుగా తేల్చినట్లు స్పష్టం చేసింది. ఈ రైలు పేలుళ్ల దుర్ఘటనలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Also Read: అత్యాచారానికి గురైన యువతి.. ధైర్యంతో మరో యువతిని కాపాడిన వీర వనిత

2006 జులై 11న ముంబయి పశ్చిమ రైల్వే లైన్‌లో పలు సబర్బన్‌ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ప్రమాదంలో 189 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మంది గాయాలపాలయ్యారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు