/rtv/media/media_files/2025/05/11/sJkJi7gIA57D804FOEhN.jpg)
AP High Court
High Court : ఏపీ హైకోర్టుకు వెసవి సెలవులు ప్రకటించారు. రేపటి(మే12) నుంచి నెలరోజుల పాటు వేసవి సెలవులు అమల్లో ఉంటాయి. తిరిగి జూన్ 16న పూర్తిస్థాయి కోర్టు కార్యకలపాలు తిరిగి ప్రారంభమవుతాయి. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వేసవికాలంలో కోర్టులకు సెలవులు ప్రకటించడం సర్వసాధారణం అలాగే ఈ ఏడాది కూడా మే 12 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు హైకోర్టు తెలిపింది. ఇక అత్యవసర కేసుల విచారణకు ఏర్పాటు చేసిన వెకేషన్ కోర్టులు మొదటి దశలో మే 15, 22, 29 తేదీల్లో, రెండో దశలో జూన్ 5, 12 తేదీల్లో విచారణలు చేపడతాయి.
ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
ఇందులో భాగంగా మే 15, 22వ తేదీల్లో న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ వై.లక్ష్మణరావు డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా విచారణలు చేస్తారు. మే 29న జస్టిస్ ఎన్.హరినాథ్, జస్టిస్ వై.లక్ష్మణరావు డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా కేసులు విచారిస్తారు.
ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్లో ప్రజల తిరుగుబాటు
జూన్ 5, 12వ తేదీల్లో విచారణ చేపట్ట నున్న రెండో దశ వెకేషన్ కోర్టుల్లో జస్టిస్ జస్టిస్ ఎం.కిరణ్మయి, జస్టిస్ టి.సి.డి.శేఖర్ డివిజన్ బెంచ్, జస్టిస్ కుంచం మహేశ్వరరావు సింగిల్ బెంచ్ విచారణ చేస్తారు.. డివిజన్ బెంచ్ కేసుల విచారణ పూర్తయ్యాక సింగిల్ బెంచ్ విధులనూ న్యాయమూర్తులు నిర్వహిస్తారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్బీజీ. పార్థసారథి ఉత్తర్వులిచ్చారు.
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!