Train Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని!

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. ట్రాక్ నిర్వహణ, సిగ్నలింగ్ పనుల కారణంగా రాష్ట్రంలో పలు ట్రైన్లు రద్దు చేసినట్లు తెలిపారు

New Update
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!

SCR: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ముఖ్య హెచ్చరికను జారీ చేశారు . తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లను రద్దు చేయటంతో పాటు మరికొన్నింటిని రూట్‌ మార్చారు.పలు రూట్లలో సిగ్నలింగ్ వ్యవస్థలను బలోపేతం చేస్తుండగా.. విజయవాడ-కాజీపేట మధ్య మోటుమర్రి వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో ట్రైన్ల రాకపోకలకు అంతరాయం ఉంటుందని అధికారులు చెప్పారు. 

Also Read: AP: ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు

ఈ నెల 26 నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు ఈ విషయాలను ట్రైన్ ప్రయాణికులు గమనించాలన్నారు. ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 28 వరకూ కాచిగూడ-మిర్యాలగూడ, మిర్యాలగూడ-నడికుడి  రైలును రద్దు చేశారు. గుంటూరు- సికింద్రాబాద్ వయా విజయాడ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్‌, సికింద్రాబాద్- గుంటూరు  ఎక్స్‌ప్రెస్ ని అధికారులు రద్దు చేశారు. ఈ నెల 27 నుంచి మార్చి 1వ వరకూ నడికుడి-మిర్యాలగూడ , మిర్యాలగూడ-కాచిగూడ రైలుని రద్దు చేశారు. 

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది రేవంత్ అనుచరులేనా? ప్రూఫ్స్ తో సహా..!

గుంటూరు-సికింద్రాబాద్- గుంటూరు గోల్కండ ఎక్స్ ప్రెస్ ఈ నెల 27 నుంచి జనవరి 9 తేదీ వరకూ గుంటూరు నుంచి కాజీపేట వరకూ నడుస్తుందన్నారు. తిరిగి కాజీపేట నుంచి గుంటూరు వెళుతుందని తెలిపారు.ఈ నెల 26 నుంచి జనవరి 8 వరకు విశాఖపట్నం- ముంబై ఎల్టీటీ  విజయవాడ నుంచి గుంటూరు మీదుగా సికింద్రాబాద్, వికారాబాద్ మీదుగా వెళ్తుందని అధికారులు చెప్పారు. 

Also Read: Fire Accident: కాచిగూడ-చెన్నై ఎగ్మోర్‌ రైలులో మంటలు

జనవరి 6 నుంచి 9 వరకూ షాలిమార్-హైదరాబాద్, జనవరి 7 నుంచి 9 తేదీ వరకు హైదరాబాద్- షాలిమార్ నడుస్తాయని చెప్పారు. వాడి-వికారాబాద్-సికింద్రాబాద్-పగిడిపల్లి-గుంటూరు- విజయవాడ మీదుగా పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు.జనవరి 7న సాయినగర్‌ షిర్డీ – కాకినాడ పోర్టు ట్రైన్, జనవరి 8న  కాకినాడ పోర్టు – సాయినగర్‌ షిర్డీ ట్రైన్, జనవరి 7న  మచిలీపట్నం – సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్, సాయినగర్‌ షిర్డీ – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రూట్‌ మార్చారు. 

Also Read: CPI: ప్రభుత్వమే సిగ్గులేకుండా 'పుష్ప'ను ప్రోత్సహించింది.. నారాయణ!

జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు ముంబై సీఎస్‌ఎంటీ – భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌ – ముంబై సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును కూడా దారి మళ్లించారు. ప్రయాణికులు ఈ విషయాలను గమనించి తమ ప్రయాణాలు కొనసాగించాలని అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు