ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా పెద్దయల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఒక కారు.. లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. మృతులు అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కాగా మృతి చెందిన ముగ్గురు సొంత అన్నదమ్ములు అని తెలిసింది. మృతులు జయచంద్ర, నాగేంద్ర, చలపతిగా గుర్తించారు. వీరిలో ఇద్దరు రిటైర్డ్ ఎస్ఐలు, ఒకరు లెక్చరర్ ఉన్నారు. ఒకే ఫ్యామిలీలో ముగ్గురి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా బంధువుల అంత్యక్రియలకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
ఇది కూడా చూడండి: వేదిక మీదే స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్-VIDEO
మరొక విషాదకర ఘటన
ఇదిలా ఉంటే తాజాగా మరొక విషాదకర సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన కుర్ర సైదులు కొడుకు పరమేష్ (25) రోజు వారి కూలి. అతడు హయత్ నగర్లో నివాసముంటూ రోజూ కూలి పని చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే మే 5వ తేదీన ప్యాకర్స్, మూవర్స్ ద్వారా బహదూర్పల్లిలోని ఓ ఇంట్లో సామన్లు దించేందుకు వెళ్లాడు. అక్కడ అతడి కుడికాలికి గాయమైంది. పాదానికి రేకు తగిలి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అది గమనించిన తోటి కూలీలు అతడిని సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు.
ఇది కూడా చూడండి: రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO
అక్కడ వైద్యులు పరమేష్ కాలికి సర్జరీ చేశారు. అనంతరం రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తామని పరమేష్ బంధువులకు చెప్పారు. అయితే ఉన్నట్టుండి మే 9న పరిస్థితి తీవ్రమైందని.. మెదడులో రక్తస్రావమైందని వైద్యులు తెలిపారు. వెంటనే శస్త్రచికిత్స చేయకపోతే చాలా ప్రమాదమని పరమేష్ బంధువులకు చెప్పారు. ఈ ట్రీట్మెంట్ కోసం దాదాపు రూ.3 లక్షలకు పైగా అవుతుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆ డబ్బు మొత్తాన్ని చెల్లించారు.
ఇది కూడా చూడండి: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్స్కీ సంచలన ప్రకటన
అనంతరం వైద్యులు పరమేష్కు ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత మే 10న పరమేష్ పరిస్థితి మరింత తీవ్రతరమైందని చెప్పడంతో.. వెంటనే అతడిని గాంధీ హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే పరమేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇది కూడా చూడండి: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!
అప్పుడే బాగున్నాడని చెప్పి.. అంతలోనే ఎలా చనిపోయాడని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. వైద్యులు, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన సోదరుడు మృతి చెందాడని పరమేష్ అన్నయ్య మహేష్ దుండిగల్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. హాస్పిటల్ డాక్టర్స్ అండ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
crime news | latest-telugu-news | telugu-news | satyasai-district