/rtv/media/media_files/2024/10/20/CDUkyDWbGkjuiOdexZjU.jpg)
Operation Sindoor effect ap CM Chandrababu key orders police
AP News: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ పోలీసు శాఖకు సీంఎ చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైమానిక దాడులకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చెయ్యాలని అధికారులకు సూచించారు. తీర ప్రాంత రక్షణకు సంబంధించి కేంద్రం ఇప్పటికే వైజాగ్ లో మాక్ డ్రిల్ నిర్వహించగా.. దీనిపై రాష్ట్ర అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
అన్ని ప్రాంతాల్లో అప్రమత్తతా చర్యలు..
హోంశాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ అప్రమత్తతా చర్యలు ప్రారంభం అయ్యాయి. సివిల్ డిఫెన్సు సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తాం. ఈ అంశాలపై ఏపీలోనూ ప్రజలను సన్నద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చాం. సచివాలయం నుంచి కేంద్ర హోమ్ శాఖా వీడియో కాన్ఫరెన్సుకు సీఎస్ విజయానంద్, డీజీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ లడ్హా, అగ్నిమాపక శాఖ డీజీ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారని చెప్పారు.
Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
ప్రస్తుతం విశాఖలోని తూర్పునౌకాదళ కమాండ్ పరిధితో పాటు అక్కడున్న రక్షణ రంగ సంస్థల భద్రతపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కీలకమైన ఇనస్టలేషన్స్ వద్ద భద్రత, తీరప్రాంత రక్షణపైనా అధికారులతో సమీక్షించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోనేందుకు ప్రజల్ని సిద్ధం చేసేలా కార్యక్రమాలు చేపట్టనుంది. తీరప్రాంత జిల్లాల్లో భద్రత పై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఇప్పటికే మెరైన్ పోలీసులకు ఆదేశాలు అందాయి. నౌకాదళం, కోస్టుగార్డు ఇతర రక్షణ దళాలతో సమాచారం పంచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.
Also Read: Operation Sindoor : పాక్పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ
cm chandrababu | telugu-news | today telugu news