/rtv/media/media_files/2025/04/17/24qqGU4R0RpV8k4ToVxA.jpg)
Lockup death
Lockup death : ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు లాకప్ లో మరణించడం కలకలం రేపుతోంది.గంజాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు పోలీస్ లాకప్ లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ( ఏప్రిల్ 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..
షేక్ సోను అనే యువకుడిని గంజాయి కేసులో కడప టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయిపై అతనిని విచారించిన పోలీసులు ఆ తర్వాత లాకప్ లో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే మనస్థాపానికి గురైన సోను లాకప్ లోని బాత్ రూమ్ గ్రిల్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్ - నీల్ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్
Also Read: వేసవిలో తరచుగా కడుపునొప్పి వస్తుందా?. ఇది తెలుసుకోండి
అయితే పోలీసులు స్టేషన్ కు తీసుకు వచ్చేటప్పటికే సోను అనారోగ్యంతో ఉన్నాడని, స్టేషన్ లో ఆరోగ్యం మరింత క్షీణించగా సోనును హాస్పిటల్ కి తరలించామని పోలీసులు తెలిపారు.అక్కడ చికిత్స పొందుతూ సోను మరణించాడని పోలీసులు చెబుతున్నారు. అయితే సోను అనారోగ్యంతో మరణించలేదని పోలీసులు హింసిచడం వల్లే బాధభరించలేక లాకప్ లో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని