Aghori - Sri Varshini: వర్షిణి ఖతం.. బలి ఇవ్వబోతున్న అఘోరీ?

అఘోరీ-శ్రీవర్షిణి వ్యవహారంపై నెట్టింట చర్చ నడుస్తోంది. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వర్షిణిని అఘోరీ బలి ఇవ్వబోతున్నాడా? అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు.

New Update

అఘోరీ - శ్రీవర్షిణి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడిదే అంశంపై నెట్టింట చర్చ నడుస్తోంది. తన ఫ్యామిలీని వదిలి అఘోరీని పెళ్లి చేసుకున్న వర్షిణికి పిచ్చి లేసిందా? అని కొందరు అంటున్నారు. అంతేకాకుండా వర్షిణిని అఘోరీ బలి ఇవ్వబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అఘోరీకి నిజంగా శక్తులున్నాయా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే.. అఘోరీ ఫేకా, రియలా అంటూ చర్చించుకుంటున్నారు. ఇలా వీరిద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. 

ఇది కూడా చూడండి: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి

మరోవైపు  వీరిద్దరూ పెళ్లి చేసుకున్న క్రమంలో నేనే అఘోరీ మొదటి భార్యను అంటూ రాధ అనే మహిళ మీడియా ముందుకు వచ్చింది. అతడి పేరు అల్లూరి శ్రీనివాస్ అని తెలిపింది. అతడు మోసగాడని.. తనను మోసం చేశాడని పేర్కొంది. మొదట తన మెడలో తాళి కట్టి.. ఇప్పుడు వర్షిణిని పెళ్లాడాడని.. అతడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. 

ఇది కూడా చూడండి: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!

షామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు

అఘోరీని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని.. ఇంకే ఆడపిల్లల జీవితాలు నాశనం కాకూడదని తెలిపింది. ఇందులో భాగంగానే ఆమె మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు ట్రాన్స్ జెండర్లు సైతం అఘోరీ పై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడే దొరికితే ఉతికి ఆరేసేటట్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వాడు అఘోరీ కాదు, ట్రాన్స్ జెండర్ కాదని అంటున్నారు. ఈ మేరకు అఘోరీపై షామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో జోగిని సంధ్య కంప్లైంట్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. వాడు అఘోరీ కాదని.. వాడొక మోసగాడని తెలిపింది. 

జోగిని సంధ్య

ఆమె మాట్లాడుతూ.. ‘‘అఘోరీగాడు ఒక ట్రాన్స్ జెండర్.. వాడు ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. వాడిని వెంటనే అరెస్టు చేయాలి. అఘోరిని పట్టుకుని లోపలెయ్యాయి. వాడు మా ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలలో పరువు తీసేశాడు. వాడు ఒకవైపు అఘోరీల పరువు, మరోవైపు ట్రాన్స్ జెండర్ల పరువు తీసేశాడు. మేము బయట తిరగాలంటే తలెత్తుకోలేకపోతున్నాం. సనాతన ధర్మం.. లోకకళ్యాణమంటూ వచ్చినోడు.. ఇప్పుడు వాడి కళ్యాణం చేసుకుని పారిపోయాడు. వాడిని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలి.’’ అంటూ డిమాండ్ చేసింది. 

ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీవర్షిణి, అఘోరీ పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయి. నిన్నటి (బుధవారం) నుంచి కూడా వారిద్దరి ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వారిపై కేసులు నమోదు అయిన నేపథ్యంలో అరెస్టు చేస్తారనే భయంతో అఘోరీ, శ్రీవర్షిణి పరారైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అఘోరీ, శ్రీవర్షిణి వ్యవహారం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉందనే చెప్పాలి. ఇది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. 

aghori sri varshini | Aghori Sri Varshini Lov | aghori srivarshini | latest-telugu-news | telugu-news

 

Advertisment
Advertisment
తాజా కథనాలు