అఘోరీ కేసులో బిగ్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. అఘోరీని గత రెండు రోజుల పాటు పోలీసులు విచారించారు. ఈ పోలీసుల విచారణలో అఘోరీ కీలకమైన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి?.. ఆ కారు ఎవరైనా ఇచ్చారా? లేక కొనుక్కుందా?.. తనకు డబ్బులు ఎవరెవరు ఇచ్చారు..? అనే విషయాలపై పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం.
Also read : 12 ఏళ్లుగా పాకిస్తాన్కు గూఢచర్యం.. రాజస్థాన్లో దొరికిన ఇంటి దొంగ!
పోలీసులు ఆరా
అంతేకాకుండా అఘోరీ వెనుక ఎవరెవరు ఉన్నారు..? తన వెనుక పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారా?.. తనకు సాయం ఎవరుచేస్తున్నారు?.. డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి.? కారుకు డీజిల్ డబ్బులు ఎవరు ఇస్తున్నారు?.. ఐఫోన్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి..? అనే అనేక అంశాలపై పోలీసులు ఆరా తీసి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఇజ్రాయెల్లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
అందుతున్న సమాచారం ప్రకారం.. అఘోరీ తిరిగిన కారు తమిళనాడుకు చెందిన ఒక బిజినెస్మ్యాన్ది అని తెలుస్తోంది. ఆ కారు రిజిస్ట్రేషన్ మొత్తం తమిళనాడు అడ్రస్తో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా అఘోరీకి.. ఆ కారు యజమాని, బిజినెస్ మ్యాన్కు సన్నిహితమైన పరిచయాలు ఉన్నట్లు తెలిసింది. వీరితోపాటు మరికొంతమంది కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా కలిసి బిజినెస్ డీల్స్ మాట్లాడుకుంటున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది.
Also Read: ఇజ్రాయెల్లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
14 రోజులు రిమాండ్
ఇదిలా ఉంటే.. తాజాగా అఘోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మోకిలా పీఎస్లో అఘోరీ కస్టడీ ముగియడంతో పోలీసులు అఘోరీ అలియాస్ శ్రీనివాస్ను ఇవాళ షాద్నగర్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ కేసును విచారించిన కోర్టు.. అఘోరీకి బిగ్ షాక్ ఇచ్చింది. మరో 14 రోజులు రిమాండ్ పొడిగించింది. దీంతో మళ్లీ అఘోరీని పోలీసులు చంచల్గూడ జైలుకి తరలిస్తున్నారు.
Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
aghori sri varshini | Lady Aghori Sri Varshini | aghori Arrest | latest-telugu-news