Aghori Arrest: అఘోరీకి బిగ్ షాక్.. బెయిల్ విషయంలో కోర్టు సంచలన నిర్ణయం!

మోకిలా పీఎస్‌లో అఘోరీ కస్టడీ ముగియడంతో పోలీసులు ఇవాళ అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను షాద్‌నగర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు.. అఘోరీకి మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగించింది. మళ్లీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకి తరలించారు.

New Update

పూజల పేరుతో ఓ మహిళను మోసం చేసి.. భారీగా డబ్బులు వసూల్ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు అఘోరీ 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా అఘోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మోకిలా పీఎస్‌లో అఘోరీ కస్టడీ ముగియడంతో పోలీసులు అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను ఇవాళ షాద్‌నగర్ కోర్టులో హాజరుపరిచారు. 

Also read : 12 ఏళ్లుగా పాకిస్తాన్‌కు గూఢచర్యం.. రాజస్థాన్‌లో దొరికిన ఇంటి దొంగ!

మరో 14 రోజుల రిమాండ్

దీంతో ఈ కేసును విచారించిన కోర్టు.. అఘోరీకి బిగ్ షాక్ ఇచ్చింది. మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగించింది. దీంతో మళ్లీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకి తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే అఘోరీని పోలీసులు రెండు రోజుల పాటు  విచారించినట్లు తెలిసింది. దీంతో పోలీసుల విచారణలో అఘోరీ పలు కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం.

Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు

అఘోరీ వెనుక బిజినెస్‌మ్యాన్

అందుతున్న సమాచారం ప్రకారం.. అఘోరీ తిరిగిన కారు తమిళనాడుకు చెందిన ఒక బిజినెస్‌మ్యాన్‌ది అని తెలుస్తోంది. ఆ కారు రిజిస్ట్రేషన్ మొత్తం తమిళనాడు అడ్రస్‌తో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా అఘోరీకి.. ఆ కారు యజమాని, బిజినెస్ మ్యాన్‌కు సన్నిహితమైన పరిచయాలు ఉన్నట్లు తెలిసింది. వీరితోపాటు మరికొంతమంది కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా కలిసి బిజినెస్ డీల్స్ మాట్లాడుకుంటున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.

aghori | aghori Arrest | lady aghori arrest | aghori sri varshini | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు