YS Jagan: జగన్ తిరుపతి పర్యటన రద్దు
మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ వివాదం, తిరుపతిలో పోలీసుల ఆంక్షలు, వైసీపీ నేతల ముందస్తు అరెస్టుల నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ వివాదం, తిరుపతిలో పోలీసుల ఆంక్షలు, వైసీపీ నేతల ముందస్తు అరెస్టుల నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
AP: తిరుపతిలో మాజీ సీఎం జగన్ పై దాడికి కుట్ర జరుగుతోందని వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో జగన్పై దాడికి కూటమి నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు తమకు సమాచారం అందినట్లు పేర్కొంది.
AP: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని వైసీపీ ముఖ్యనేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు జగన్ పాపప్రక్షాళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా నోటీసులు ఇచ్చారు. మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు.
AP: జగన్ తిరుమల పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని పురందేశ్వరి అన్నారు. కాగా ఎల్లుండి తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని జగన్ దర్శించుకోనున్నారు.
చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశాడని ఫైర్ అయ్యారు జగన్. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
AP: కడపలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాల్వను ఆక్రమించి వైసీపీ కార్పొరేటర్ చేసిన లే అవుట్ను అధికారులు కూల్చివేస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా కులుస్తున్నారని వైసీపీ శ్రేణులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. నేడు కోస్తా ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కడప జిల్లాలో ఏటీఎం దొంగతనాలు దుమారం రేపుతున్నాయి. నగరంలోని పలు ఏటీఎంలో డబ్బు చోరీకి గురైంది. విశ్వసరాయ సర్కిల్ వద్ద చోరీకి ప్రయత్నించగా సైరాన్ మోగడంతో దొంగలు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
చంద్రబాబు 100 రోజుల పాలన వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చడం, పేర్లను తొలగించేందుకే సరిపోయినట్లుగా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.