/rtv/media/media_files/2025/04/22/X0ZvGjAkD4VJTPsGppcN.jpg)
Tirumala Tirupati Devasthanams
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీ కోసం గత ప్రభుత్వ హయాంలో సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సిట్ హైకోర్టుకు తేల్చి చెప్పింది. నెయ్యి సరఫరా చేయడానికి టీటీడీ ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీలతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ అసలు దానివెనుక ఉన్నది మాత్రం భోలేబాబా డెయిరీ అని స్పష్టం చేసింది.
ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!
టీటీడీ లో లడ్డూ ప్రసాదం తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో బెయిలు ఇవ్వాలని కోరుతూ నిందితులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. కోర్టును ఆశ్రయించిన వారిలో ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్, 3, 4వ నిందితులు భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్, 5వ నిందితుడు వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్కాంత్ చావడా ఉన్నారు. కాగా ఈ విషయమై సిట్ కోర్టులో తన వాదన వినిపించింది.
భలే బాబా డోయిరీ సంస్థకు పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్వవస్థే లేదని సిట్ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు ఆ సంస్థ ఎక్కడ కూడా రైతుల నుంచి పాలు సేకరించిన దాఖలాలు లేవని, రైతులు కూడా అదే చెప్పారని సిట్ తెలిపింది. భోలేబాబా డెయిరీ కేవలం పామాయిల్, రసాయనాలు, ముడిపదార్థాలతో నకిలీ నెయ్యి తయారుచేసి ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందని స్పష్టం చేసింది. వీరంతా ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ ముందుపెట్టి భోలేబాబా డెయిరీ తన నకిలీ వ్యవహారం నడిపిందని ఆరోపించింది. ఈ మేరకు సీబీఐ తరఫు న్యాయవాది పీఎస్పీ సురేష్కుమార్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ ఢీకొని తండ్రీ కొడుకులు మృతి
‘‘ గతంలో భోలేబాబా డెయిరీ నెయ్యిని సరఫరా చేయగా అది నకిలీ అని తేలడంతో టీటీడీ దాన్ని బ్లాక్ లిస్టులో పెట్టిందని తెలిపారు. దీంతో తన నెయ్యిని ఎలాగైనా టీటీడీ కి సరఫరా చేయాలనుకున్న భోలేబాబా డెయిరీ ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీలను ముందుపెట్టి తన కథను నడిపించిందని సిట్ ఆరోపించింది. కాగా దీనికి సంజీవ్ జైన్ అనే వ్యక్తి సాక్షిగా ఉన్నాడని, ఆయన ఏప్రిల్ 7న ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి రాగా.. ఆయనపై పిటిషనర్లు, వారి తరఫు వారు బెదిరించి దాడిచేశారని సిట్ ఆరోపించింది.అనంతరం ఆయనను చెన్నై నుంచి తిరిగి ఢిల్లీకి పంపించివేశారన్నారు.
ఇదే కేసులో నిందితుడైన అశిష్ రోహిల్లా మేజిస్ట్రేట్ ముందు నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధపడగా.. అతనికి తెలియకుండానే అతనిపేరుతో హైకోర్టులో వ్యాజ్యం వేశారని ఆరోపించారు. ఆ విషయం తెలిసిన రోహిల్లా హైకోర్టు రిజిస్ట్రార్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారన్నారు. పిటిషనర్లు ఆర్థికంగా బలవంతులు కావడం వల్ల కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని సిట్ తెలిపింది. వారికి బెయిలిస్తే సాక్షులకు తీవ్ర ప్రమాదముందని ఆందోలన వ్యక్తం చేసింది. నకిలీ నెయ్యి సరఫరాకు కుట్రపన్నినట్లు పక్కా ఆధారాలు లభించాయని. వాట్సప్ గ్రూప్ చాటింగ్ వివరాలను కూడా సేకరించామని సిట్ తెలిపింది. ఇప్పుడు బెయిలు ఇవ్వడం వల్ల కేసుమీద ప్రభావం చూపే అవకాశం ఉంటుందని సిట్ తరపు న్యాయవ్యాది అభిప్రాయపడ్డారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్.. అంతిమంగా నిందితుల తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు.
అసలు నెయ్యి కథేంటంటే...
శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో నిత్య ఆరాధనలు, అన్న ప్రసాదాల తయారీకి, లడ్డు ప్రసాదాలకు అధికంగా వినియోగించేది స్వచ్ఛమైన నెయ్యి మాత్రమే. అన్న ప్రసాదాల నుంచి లడ్డూ ప్రసాదాల వరకు రుచికరంగా ఉండాలంటే స్వచ్ఛమైన నెయ్యి అవసరం. టీటీడీ ఏటా 5 వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది. ప్రధానంగా శ్రీవారి లడ్డూల తయారీతో పాటు ఇతర ప్రసాదాల తయారీకి దాదాపు 5 వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నట్లు ఈ మధ్యనే టీటీడీ అధికారికంగా ప్రకటించింది. మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది టీటీడీ.ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఒక కమిటీతో పాటుగా టీటీడీ బోర్డు కమిటీ ఆ తర్వాత పాలకమండలి తీర్మానం అనంతరం నెయ్యిని కొనుగోలు ప్రక్రియ సాగిస్తుంది టీటీడీ. నెయ్యి నాణ్యత విషయంలోనూ రాజీ పడకుండా పరీక్షించేందుకు అధునాతనమైన లేబొరేటరీని కూడా టీటీడీ తిరుమలలో ఏర్పాటు చేసింది. గతంలో నందిని నెయ్యి టీటీడీకి నెయ్యి సరఫరా చేసేది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీలతో ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read: తొక్కిసలాట మృతులకు RCB భారీ పరిహారం.. ఒక్కో కుటుంబానికి
అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు గత పాలకులు అన్నప్రసాదాల తయారీకి, లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు కలిపిన నాసిరకమైన నెయ్యిని వినియోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందువల్లే గత ప్రభుత్వ హయాంలో క్వాలిటీ, రుచి లేని లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాలు వితరణ చేశారని ఆరోపించారు. కాగా దీన్ని వైసీపీ నేతలు ఖండించారు. అయితే ఆ తర్వాత నెయ్యి వివాదం రాజుకొని సిట్ ఏర్పాటు వరకు వెళ్లింది. సిట్ ఆధ్వర్యంలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తు్న్నారు. కాగా విచారణ కొనసాగుతున్న సమయంలోనే నిందితులుగా ఉన్న వారు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఐతే వారు సరఫరా చేసింది నెయ్యే కాదని సిట్ ఆరోపించినప్పటికీ అందులో జంతువుల కొవ్వు ఉన్న విషయాన్ని ఎక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం.
tirupathi | AP CM Chandrababu | ttd | tirumala-tirupati-devasthanams | tirumala-tirupathi | political-war-with-ghee | no-ghee-to-ttd-laddu