RCB compensation: తొక్కిసలాట మృతులకు RCB భారీ పరిహారం.. ఒక్కో కుటుంబానికి

బెంగళూరు తొక్కిసలాటలో మృతిచెందిన కుటుంబాలకు RCB పరిహారం ప్రకటించింది. 11 మంది కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. గాయపడినవారికి RCB కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.

New Update
Tragedy At RCB IPL 2025 Celebration

బెంగళూరు నిన్న ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది. చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయగా వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. దీంతో అక్కడ భారీ స్థాయిలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. మరో 50 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. 

ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

అయితే ఈ తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన 11 మంది కుటుంబాలకు RCB పరిహారం ప్రకటించింది. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఈ ఘటనలో గాయపడినవారి కోసం RCB కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!

RCB TWEET

ఈ మేరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. ‘‘నిన్న బెంగళూరులో జరిగిన దురదృష్టకర సంఘటన RCB కుటుంబానికి తీవ్ర వేదన, బాధను కలిగించింది. గౌరవ చిహ్నంగా, సంఘీభావ సంజ్ఞగా, మరణించిన వారి పదకొండు కుటుంబాలకు RCB ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 

అదనంగా ఈ విషాద సంఘటనలో గాయపడిన అభిమానులను ఆదుకోవడానికి RCB కేర్స్ అనే ఫండ్స్‌ కూడా ఏర్పాటు చేస్తుంది. మేము చేసే ప్రతి పనిలోనూ మా అభిమానులు ఎల్లప్పుడూ గుండెకాయలా ఉంటారు.’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు