Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు

ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తుతుంది. ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, విద్యుత్‌ ఉత్పాదన కోసం 26,817 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది.

New Update
Flood Water Into Srisailam Project

Flood Water Into Srisailam Project

Srisailam project :  ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తుతుంది. మరోవైపు ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, విద్యుత్‌ ఉత్పాదనతో 26,817 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేయడంతో భారీగా వరదనీరు శ్రీశైలానికి వచ్చి చేరుతుంది.

Also Read :  రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

Flood Water Into Srisailam Project

శ్రీశైలం ఇన్ ఫ్లో .. 30.797 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో పూర్తిగా నిలిపివేశారు.. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు.. కాగా ప్రస్తుతం నీటిమట్టం 829.80 అడుగులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం  215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 49.3230 టీఎంసీల నీరుంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశం లేకపోవడంతో కొంతకాలంగా జలవిద్యుత్‌ ఉత్పత్తి కావడం లేదు.

Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
 
మరోవైపు ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేసి, విద్యుత్‌ ఉత్పాదనతో 26,817 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా 31,162 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంకు వైపునకు వస్తుండగా, 36,740 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.  416 క్యూసెక్కుల నీటిని ఎంజీకేఎల్‌ఐ కాల్వ ద్వారా మళ్లిస్తున్నారు. దీంతో నిన్న  ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను, 828.20 అడుగులకు చేరింది. 215.807 టీఎంసీల సామర్థ్యానికి గాను 47.7648 టీఎంసీల నీటి నిల్వలు నమోదు అయినట్లు డ్యాం గేజింగ్‌ అధికారులు తెలిపారు.  1,095 క్యూసెక్కుల నీటితో ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో 0.484 మిలియన్‌ యూనిట్లు, 638 క్యూసెక్కులు నీటిని వినియోగించి కుడి గట్టు కేంద్రంలో 0.291 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పాదన చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం నిల్వ నీటి నుంచి 2,310 స్యూసెక్కుల నీరు అవుట్‌ ఫ్లో కొనసాగుతున్నదని అధికారులు వెల్లడించారు. వరదనీరు ఇలాగే కొనసాగితే త్వరలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు వెల్లడించారు.

Also Read: cinema: కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పని వాళ్ళే దొంగిలించారు..విష్ణు

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

 

srisailam-project | srisailam-reservoir | srisailam-dam | srisailam-power-house

Advertisment
Advertisment
తాజా కథనాలు