Manyam Bandh : ప్రశాంతంగా మన్యం బంద్...మరో 24 గంటల టెన్షన్ ..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. రేపు కూడా మన్యం బంద్ కొనసాగనుంది.