Pawan Kalyan: జగన్‌కు థాంక్స్ చెప్పిన పవన్.. ఎందుకో తెలుసా?

పవన్ కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేటీఆర్, లోకేష్, చంద్రబాబు, జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పవన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పడంతో నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.

New Update
Pawan Kalyan thanks to jagan

Pawan Kalyan thanks to jagan Photograph: (Pawan Kalyan thanks to jagan)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు తీవ్రంగా గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. ప్రస్తుతం పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

స్పందించిన ప్రతీ ఒక్కరికి..

పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్, లోకేష్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మాజీ సీఎం జగన్, ప్రధాని మోదీ తదితరులు స్పందించారు. వీరి అందరికీ పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. అరకు పర్యటనలో ఉన్న పవన్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. స్పందించిన ప్రతీ ఒక్కరికి కూడా థ్యాంక్స్ తెలిపారు. ఏపీ మాజీ సీఎంకు కూడా థ్యాంక్స్ చెప్పడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

జగన్ ఇలా ట్విట్ చేస్తూ.. సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబం గురించే ఉన్నాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేశారు. 

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

latest-telugu-news | tweets | telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news

Advertisment
Advertisment
తాజా కథనాలు