/rtv/media/media_files/2025/04/08/cQwoPLDyYjAav4Swx0S0.jpg)
USA-China
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరి పోయింది. చైనా వెనక్కు తగ్గకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ మూడు రోజుల నుంచి హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఆ దేశంపై విధిస్తున్న సుంకాలను 104 శాతం పెంచి భారీ షాక్ ఇచ్చారు. ఇవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ కార్యదర్శి ప్రకటించారు.
ముందే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు..
రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల్లో భాగంగా చైనాపై 54 శాతం సుంకాలను విధించారు. దీనికి ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై ట్రంప్ మండిపడ్డారు చైనా తప్పు చేస్తోందని హెచ్చరించారు. ఏప్రిల్ 8లోగా సుంకాలను తగ్గించకపోతే 50శాతం పెంచుతామని చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈరోజు చైనాపై ఏకంగా 104 శాతం మేర టారీఫ్ లను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
today-latest-news-in-telugu | usa | china | trump tariffs
Also Read: PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..