/rtv/media/media_files/2024/10/20/CDUkyDWbGkjuiOdexZjU.jpg)
CM Chandrababu good news on Annadatta Sukhibhava scheme
ఏపీ పేదలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని మే నెలాఖరులోగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మే 18 తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా మిగిలిన అన్ని కమిటీలూ వేయాలని అధికారులకు సూచించారు.
Also Read : హైదరాబాద్లో దారుణం.. యజమాని మర్మాంగాలు కొరికి చంపిన కుక్క!
గుజరాత్ మోడల్ రాష్ట్రంలోనూ..
ఈ మేరకు కడపలో 27, 28, 29 తేదీల్లో మహానాడు జరగనుండగా.. ఆదివారం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 12నాటికి కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కానున్నట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గుజరాత్ మోడల్ రాష్ట్రంలోనూ అమలుకావాలని చెప్పారు. ప్రభుత్వానికి ఇచ్చినంత ప్రాధాన్యం పార్టీకీ ఇస్తున్నామన్న చంద్రబాబు.. పాలనలోనే స్పష్టమైన మార్పు చూపించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించామని అన్నారు.
Also Read: వీడు భర్త కాదు బండరాయి.. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తినేశాడు వెధవ!
ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నాం. మెగా డీస్సీ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నాం. ‘దీపం-2’ కింద కోటి మందికిపైగా లబ్ధిదారులకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం. పోలవరానికి నిధులు రాబట్టి 2027 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా పని చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: కీలక అప్డేట్.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మరో టెర్రరిస్ట్ అరెస్టు
Also Read : తెలుగు సినిమాకు ట్రంప్ దెబ్బ.. 7 వేలు దాటనున్న టికెట్ ధరలు!
cm chandrababu | today telugu news | andhra-pradesh-news | latest-telugu-news | Annadatta Sukhibhava Scheme