Andhra Pradesh: విషాదం.. ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి

చిత్తూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. నార్త్ జమ్మూ కశ్మీర్‌లో భారత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కార్తీక్ చికత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Army Jawan Karthik

Army Jawan Karthik

సరిహద్దుల్లో ఉండి దేశాన్ని నిరంతరం రక్షించే ఆర్మీ జవాన్ల పాత్ర ఎంత ముఖ్యమే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబానికి దూరంగా ఉంటూ.. శత్రువుల నుంచి దాడులు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండే బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు. ఎంతోమంది జవాన్లు ఉగ్రదాడిలో వీర మరణం పొందారు. అయితే తాజాగా మరో విషాద ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు.   

Also Read: పేపర్‌ లీకులు.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ

నార్త్ జమ్మూ కశ్మీర్‌లో భారత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఆర్మీ జవాన్ కార్తీక్ తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఆ తర్వాత ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ కార్తీక్ సోమవారం తుదిశ్వాస విడిచారు. కార్తీక్ స్వస్థలం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం. రాగిమాను పెంట.  

Also Read: ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌లో నల్గొండ వాసి మృతి.. ఆ గ్రామంలో విషాద ఛాయలు!

రైతు కుటుంబానికి చెందిన కార్తీక్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే కలలు కనేవారు. అనుకున్నట్లుగానే 2017లో ఆర్మీకి సెలెక్ట్‌ అయ్యారు. అప్పటినుంచి ఆర్మీ జవాన్‌గా తన విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తాజాగా జరిగిన కాల్పుల్లో కార్తీక్ వీర మరణం పొందారు. దీంతో కార్తీక్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం అర్ధరాత్రికి కార్తీక్ మృతదేహం స్వగ్రామం చేరుకోనుంది. బుధవారం తన స్వగ్రామంలో ఆర్మీ అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరగనున్నాయి.  

Also Read: మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా!

 Also Read: ఇండియాలో 26 శాతం ఉద్యోగాలు AI కారణంగా ప్రభావితం

 

Advertisment
Advertisment
తాజా కథనాలు