YS Sharmila: ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం.. ఇదిగో ప్రూఫ్.. షర్మిల సంచలనం!
తన ఫోన్ తో పాటు తన భర్త ఫోన్, దగ్గర వాళ్ల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన తన ఆడియో ఒకటి తనకే వినిపించినట్లు చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజమని.. ఈ విషయాన్ని బైబిల్ మీద ప్రమాణం చేసి చెబుతున్నానన్నారు. తన ఫోన్ తో పాటు తన భర్త ఫోన్, దగ్గర వాళ్ల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన తన ఆడియో ఒకటి తనకే వినిపించినట్లు చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానన్నారు. రేవంత్, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందన్నారు. తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ ఫోన్ ట్యాపింగ్ అని ధ్వజమెత్తారు.
ఏపీ, తెలంగాణలో జరుగుతున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ విషయం చిన్నదిగా అనిపించిందన్నారు. అందుకే ఆ విషయాలు చెప్పలేకపోయానన్నారు. తన రాజకీయ భవిష్యత్ నాశనం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు. తనకు అండగా నిలబడ్డ వారికి బెదిరింపులు చేశారన్నారు. జగన్ తాను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారన్నారు. అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు చేయటానికి సిద్ధమన్నారు షర్మిల. షర్మిల ఆరోపణలపై బీఆర్ఎస్, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనే అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
YS Sharmila: ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం.. ఇదిగో ప్రూఫ్.. షర్మిల సంచలనం!
తన ఫోన్ తో పాటు తన భర్త ఫోన్, దగ్గర వాళ్ల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన తన ఆడియో ఒకటి తనకే వినిపించినట్లు చెప్పారు.
YS Sharmila
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజమని.. ఈ విషయాన్ని బైబిల్ మీద ప్రమాణం చేసి చెబుతున్నానన్నారు. తన ఫోన్ తో పాటు తన భర్త ఫోన్, దగ్గర వాళ్ల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన తన ఆడియో ఒకటి తనకే వినిపించినట్లు చెప్పారు.
Also Read : వాట్సాప్ను డిలీట్ చేయండి.. ఇరాన్ సంచలన ప్రకటన
Also Read : బుల్లితెరపై పుష్ప రాజ్ మరో రికార్డు..!
ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానన్నారు. రేవంత్, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందన్నారు. తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ ఫోన్ ట్యాపింగ్ అని ధ్వజమెత్తారు.
Also Read : Zelio E Mobility: చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీ మైలేజ్!
అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు చేస్తా..
ఏపీ, తెలంగాణలో జరుగుతున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ విషయం చిన్నదిగా అనిపించిందన్నారు. అందుకే ఆ విషయాలు చెప్పలేకపోయానన్నారు. తన రాజకీయ భవిష్యత్ నాశనం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు. తనకు అండగా నిలబడ్డ వారికి బెదిరింపులు చేశారన్నారు. జగన్ తాను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారన్నారు. అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు చేయటానికి సిద్ధమన్నారు షర్మిల. షర్మిల ఆరోపణలపై బీఆర్ఎస్, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనే అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
Also Read : Volcanic Eruption : బద్దలైన అగ్నిపర్వతం.. వెనక్కి మళ్లిన ఎయిరిండియా విమానం
telugu-news | ys-sharmila | Latest News | telugu breaking news