/rtv/media/media_files/2025/03/21/PN9vYsJOgwH3YRh4nN4a.jpg)
farook
Breaking:ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య షమనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఇంట్లో వెంటిలెటర్ పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి ఈ ఉదయం మృతి చెందారు.
Also Read: Ap-Telangana: నేటి నుంచి తెలంగాణలో మూడు రోజుల పాటు వడగళ్లు,ఉరుములతో వానలు!
శనివారం ఉదయం హైదరాబాద్ లోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపట్ల సీఎంతో పాటు మంత్రులు,ముఖ్య నేతలు సంతాపం తెలిపారు.
సతీమణి మరణవార్త తెలియడంతో మంత్రి ఫరూక్ హుటాహుటిన నంద్యాల నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. షెహనాజ్ పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తరలించనున్నారు.. అంత్యక్రియల్ని శనివారం నిర్వహించే అవకాశం ఉంది.
మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షెహనాజ్ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపాన్ని తెలియజేశారు. ఎన్ఎండీ ఫరూక్ సతీమణి మృతి పట్ల మంత్రి లోకేష్ సంతాపాన్ని తెలియజేశారు. షెహనాజ్ ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నాను అన్నారు. అలాగే మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Also Read: America-Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్!
Also Read: Phone Pay-Google Pay: ఫోన్ పే, గూగుల్ పే వాడే వారికి షాక్.. కొత్త రూల్స్!
minister | farook-abdhullah | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates