/rtv/media/media_files/2025/06/23/ap-crime-2025-06-23-16-11-32.jpg)
ap crime
AP Crime: శ్రీశైలం పవిత్ర క్షేత్రంలో బాంబులు, బుల్లెట్ల కలకలం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం వాసవీ సత్రం ఎదురుగా అనుమానాస్పదంగా ఉన్న సంచి స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సంచిని తనిఖీ చేశారు. ఆ సంచిలో నాలుగు కుడికందే బాంబులు, పదమూడు బుల్లెట్లు కనిపించాయి. ఈ ఘటనతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎంతోమంది భక్తులు తరలి వచ్చే పుణ్యక్షేత్రం వద్ద ఇలాంటి హత్యాయత్నానికి తలపడినవారెవరు? వారికీ ఏమిటి ఉద్దేశ్యం? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!
బాంబులు, బుల్లెట్ల కలకలం..
పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వదిలివేయబడిన బాగ్ ఎవరికి చెందింది..? ఎవరు వదిలివేశారు? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఆలయానికి చెందిన సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతానికి వచ్చే మార్గాల్లోని మరిన్ని కెమెరాల దృశ్యాలను కూడా సేకరిస్తున్నారు. అయితే ఈ స్థలంలో బాంబులు వదిలిపెట్టడం వెనక ఉద్దేశ్యమేమిటన్న ప్రశ్నకు ఇంకా స్పష్టత రాలేదు. ఉగ్రవాద లక్ష్యాలా? స్థానిక శత్రుత్వాలా? లేక భయపెట్టి కలకలం సృష్టించాలన్న కుట్రా అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: మెదడు చెడు జ్ఞాపకాలను ఎలా చెరిపి వేస్తుంది.. నిపుణులు చెప్పిన షాకింగ్ విషయాలు..!!
శ్రీశైలం ఆలయం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చె గుడి. ఇక్కడ భద్రతా పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలోనే ఉంటాయి. ఇలాంటి సందర్భంలో నేరుగా దేవస్థానానికి సమీపంలో పేలుడు పదార్థాలు వెలికితీయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల భద్రతకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో ఇది జరిగి ఉంటుందన్న అనుమానాలు మూడుతున్నాయి. పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో గస్తీలు పెంచి, సందేహాస్పదంగా కనిపించే వారిని విచారిస్తున్నారు. ఇదే సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనతో శ్రీశైలంలో కలకలం రేగినప్పటికీ.. పోలీసులు చురుగ్గా స్పందించి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారు. పూర్తి దర్యాప్తు అనంతరం అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: జీవక్రియను పెంచే అల్పాహారం ఇదే.. ఉదయాన్నే తింటే వేగంగా శక్తి స్థాయి పెరుగుతుంది
Also Read: ఉప ఎన్నికల్లో ఫలితాల్లో ఆప్ ప్రభంజనం.. షాక్లో బీజేపీ