Gadwal Murder Twist : తేజేశ్వర్ హత్యకేసులో మరో ట్విస్ట్..భార్యను కూడా చంపాలనుకున్న బ్యాంక్ మేనేజర్..ఆరోసారి సక్సెస్

నంద్యాలలో హత్యకు గురైన గద్వాల సర్వేయర్‌ తేజేశ్వర్‌ మర్డర్‌ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు నెలకొంటున్నాయి. ఈ హత్యకేసులో ప్రధాన కుట్రదారుడు బ్యాంక్‌ మేనేజర్‌ తిరుమలరావు తేజేశ్వర్‌తో పాటు తన భార్యను కూడా చంపాలని నిర్ణయించుకున్నాడనే విషయం వెలుగు చూసింది.

New Update
Gadwal Murder Case

Gadwal Murder Case

Gadwal Murder Twist :  నంద్యాలలో హత్యకు గురైన గద్వాల సర్వేయర్‌ తేజేశ్వర్‌ మర్డర్‌ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు నెలకొంటున్నాయి. ఈ హత్యకేసులో ప్రధాన కుట్రదారుడిగా ఉన్న బ్యాంక్‌ మేనేజర్‌ తిరుమలరావు తేజేశ్వర్‌తో పాటు తన భార్యను కూడా చంపాలని నిర్ణయించుకున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాక తేజేశ్వర్ ను చంపడానికి ఐదుసార్లు విఫలయత్నం చేసి ఆరోసారి తుదముట్టించినట్లు తేలింది.

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

తిరుమలరావుకు పెళ్లయి 8 సంవత్సరాలవుతోంది. అయితే వారికి పిల్లలు కలగలేదు. దీంతో తన బ్యాంక్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న సుజాతతో  అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమె కూతురు ఐశ్వర్య పరిచయం అయింది. ఆ పరిచయం ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. తిరుమలరావు వారికి ఆర్థిక పరమైన సాయం చేస్తుండటంతో సుజాత, ఐశ్వర్య ఇద్దరూ అతినితో తమ శారీరక బంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఐశ్వర్యతో పిల్లలు కనాలనే కోరిక ఉన్న తిరుమల రావు తన భార్యను కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు ఐశ్వర్య జీవితంలో అడ్డుగా ఉన్న తేజేశ్వర్‌ను కూడా 
లేపేయ్యాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం  సుపారీ గ్యాంగ్‌ను  ఏర్పాటు చేశాడు.

ఇక తిరుమల రావు ప్లాన్ ప్రకారం జూన్ 17న, నగేష్, పరుశురాం, రాజు అనే ముగ్గురు కలిసి ల్యాండ్ సర్వే పేరుతో తేజేశ్వర్‌ను కారులో తీసుకెళ్లారు. అంతా ముందుగానే స్కెచ్‌ గీసుకున్న తిరుమలరావు ముందురోజే రూ.20 లక్షలు బ్యాంక్‌ నుంచి డ్రా చేసుకుని దగ్గర పెట్టుకున్నాడు. తేజేశ్వర్‌ను కారులో తీసుకొస్తూ కత్తితో పొడిచి చంపిన సుపారీ గ్యాంగ్‌ కారులో ఉన్న శవాన్ని వీడియోకాల్‌ ద్వారా తిరుమలరావుకు చూపించారు. అనంతరం కర్నూల్‌ బార్డర్‌లో మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత నేరుగా తిరుమలరావు దగ్గరకు వెళ్లిన హంతకులు రూ.2 లక్షలు తీసుకుని వెళ్లిపోయారు. తేజేశ్వర్‌ హత్య తరువాత తిరుమలరావుతో కలిసి లడఖ్‌ వెళ్లాలనుకున్న ఐశ్వర్య తన తల్లికి ఫోన్ చేసి అవసరమైన దుస్తులు కూడా తెప్పించుకుంది. అయితే హత్య తర్వాత అనుమానంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆమె ప్లాన్‌ వర్కవుట్‌ కాలేదు. కానీ, తిరుమలరావు పరారీలో ఉన్నాడు. అతను లడఖ్‌ వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆయన కోసం గాలిస్తున్నారు.

Also Read: డైరెక్టర్‌ మిస్సింగ్‌ మిస్టరీ.. విషాదం మిగిల్చిన విమాన ప్రమాదం
  
ఐదు సార్లు ప్రయత్నించి..ఆరోసారి...


తిరుమలరావు తో అక్రమసంబంధాన్ని కొనసాగిస్తూనే ఐశ్వర్య తేజేశ్వర్ ను ప్రేమించినట్లు తెలుస్తోంది. వీరిమధ్య ప్రేమ ఎక్కడ మొదలైందనే విషయం తెలియనప్పటికీ  ప్రైవేట్ సర్వేయర్‌గా పని చేస్తున్న తేజేశ్వర్‌, ఐశ్వర్యతో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిచింది.  అయితే ఐశ్వర్య కుటుంబం మీద సదాభిప్రాయం లేని తేజేశ్వర్‌ కుటుంబం ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా తేజేశ్వర్‌ అందరినీ బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అయితే తన భార్యకు పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను రెండో భార్యగా చేసుకోవలనుకున్న తిరుమలరావుకు ఇది నచ్చలేదు.
 
ఒక దశలో పెళ్లికి ముందే తిరుమలరావు, ఐశ్వర్య లేచిపోవాలనుకున్నారు. అందుకు తగ్గట్టే ఐశ్వర్య ఇంటినుంచి వెళ్లి పోయింది. దీంతో నిశ్చితార్థం క్యాన్సిల్‌ కూడా అయింది. అయితే తిరుమల రావు ప్లాన్‌లో భాగంగా  మాయ మాటలతో తేజేశ్వర్‌ను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అయినా తిరుమలరావుతో శారీరక సంబంధాన్ని కొనసాగించింది.  తేజేశ్వర్‌ హత్యకు చేసిన  ప్లాన్‌లో భాగంగా తేజేశ్వర్ బైక్‌కు సీక్రెట్‌గా జీపీఎస్ ట్రాకర్ అమర్చింది. అలా అతని ప్రతి కదలికను తన ప్రియుడికి చేరవేసింది. తేజేశ్వర్‌ కదలికను బట్టి  మొత్తం ఐదుసార్లు హత్యకు ప్రయత్నించి విఫలమవగా, ఆరోసారి మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.   తేజేశ్వర్ హత్యకేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, హంతకుడు మనోజ్, క్యాబ్ డ్రైవర్, మధ్యవర్తితో పాటు మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

ఇది కూడా చూడండి: Mosquito Drone: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు