/rtv/media/media_files/2025/10/20/mlc-kalvakuntla-kavitha-biyyapu-madhu-sudan-reddy-2025-10-20-12-50-14.jpg)
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(kalvakuntla-kavitha) దంపతులు నిన్న తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తికి కూడా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత దంపతులకు వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి(biyyapu-madhusudhan-reddy) ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం స్వయంగా ఆలయ విశేషాలను వివరించారు. కవితకు స్వాగతం పలుకుతూ శ్రీకాళహస్తిలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు మధుసూదన్ రెడ్డి. ఈ ఫ్లెక్సీలపై కవితతో పాటు కేసీఆర్ ఫొటోలను సైతం ఆయన ఏర్పాటు చేయించారు.
ఆంధ్రప్రదేశ్లో కవితక్కకు ఘనస్వాగతం
— Meka Jayanth Yadav (@JayanthyadavKCR) October 20, 2025
శ్రీకాళహస్తిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారికి ఘన స్వాగతం
భారీ ఫ్లెక్సీలతో స్వాగతం పలికిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు #KalvakuntlaKavitha#TelanganaJagruthi#Srikalahasti#AndhraPradeshpic.twitter.com/dZMRcpr3Im
Also Read : టీడీపీలో విషాదం.. కీలక నేత కన్నుమూత!
మధుసూదన్ రెడ్డి ఇంట్లో భోజనం..
దర్శనం అనంతరం కవిత దంపతులు మధుసూదన్ రెడ్డి ఇంట్లో భోజనం చేశారు. మధుసూదన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు వారికి స్వయంగా వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. కవిత దంపతులు, బియ్యపు మధుసుదన్ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తికి వచ్చిన కవితకు ఆయన ఘన స్వాగతం పలికినట్లు సమాచారం.
Also Read : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
Follow Us