Telangana: దారుణం.. పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఉద్యోగి (CA) ఆత్మహత్య చేసుకున్నాడు. హీలియం గ్యాస్ పీల్చుకొని సూసైడ్‌ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

New Update
Death

Death

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఉద్యోగి (CA) ఆత్మహత్య చేసుకున్నాడు. హీలియం గ్యాస్ పీల్చుకొని సూసైడ్‌ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో సురేశ్ రెడ్డి (28) అనే యువకుడు ఓ కంపెనీలో సీఏగా పనిచేస్తున్నాడు. అతని సోదరుడితో కలిసి మణికొండలో ఉంటున్నాడు.

Also Read: బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

అయితే జూన్ 16న సురేశ్‌ రెడ్డి తన సోదరి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొండాపూర్‌లోని రాజరాజేశ్వరీ కాలనీలో ఉన్న సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చివరికి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

Also Read: ఇరాన్‌లో 1,100 లక్ష్యాలను ధ్వంసం చేశాం.. ఇజ్రాయెల్‌ కీలక ప్రకటన

అయితే సురేశ్ గదిలో హీలియం గ్యాస్‌ సిలిండర్‌తో పాటు సూసైట్‌ నోట్ కూడా లభ్యమయ్యింది. తాను పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని అతడు సూసైడ్‌ నోట్‌లో రాశాడు. ఇక మృతుడి స్వస్థలం కామారెడ్డి జిల్లా పాల్వంచగా గుర్తించారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు