MLC Kavitha: సంతోష్ రావు ధన దాహం ఎలాంటిదంటే?: కవిత సంచలన ఆరోపణలు!

కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా హరీశ్‌రావు, సంతోష్‌రావు ను లక్ష్యంగా చేసుకుని కవిత సంచలన ఆరోపణలు చేశారు. సంతోష్‌రావు గురించి పెద్దగా చెప్పుకునేంత సీన్‌ లేదంటూనే పలు ఆరోపణలు చేశారు. ఆయన ధనదాహం అన్నారు.

New Update
MLC Kavitha

MLC Kavitha

Kavitha Press Meet

బీఆర్‌ఎస్‌ పార్టీ(brs party) నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kalvakuntla kavitha) ను సస్పెండ్‌ చేసిన తర్వాత మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా హరీశ్‌రావు, సంతోష్‌రావు ను లక్ష్యంగా చేసుకుని కవిత సంచలన ఆరోపణలు చేశారు. సంతోష్‌రావు గురించి పెద్దగా చెప్పుకునేంత సీన్‌ లేదంటూనే పలు ఆరోపణలు చేశారు. సంతోష్‌ రావు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాను మేనేజ్‌ చేస్తారన్నారు. రామన్నను రిక్వెస్ట్‌ చేస్తున్న మీరు కూడా ఆ స్కిల్‌ నేర్చుకోమని సూచించారు. సంతోష్‌రావు కూరల ఉప్పులాంటోడు అన్న కవిత అన్ని చెడగొట్టడానికే ఉంటాడన్నారు. సంతోష్‌ రావు(santosh-rao) ధనదాహం ఎలాంటిదంటే  నేరెళ్లలో ఇసుక లారీ గుద్ది ఒక దళిత బిడ్ద చనిపోతే ఇక్కడి నుంచి ఫోన్‌ చేసి పోలీసులను ఒత్తిడి చేసిఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టించాడని ఆరోపించారు. మూడునాలుగు సార్లు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. దానితో వారి కుటుంబాలు ఏం పని చేసుకోలేని పరిస్థితి నెలకొంది అన్నారు.  అదంతా రామన్న మెడకు చుట్టుకుందన్నారు. నేరం చేసింది సంతోష్‌ అయితే రామన్న పేరు బదనాం అయిందన్నారు. రేవంత్ రెడ్డితో అండర్‌స్టాండింగ్‌ ఉండటం వల్లే టానిక్‌ లాంటి కేసులు మూసేసరని కవిత ఆరోపించారు.

తెలంగాణకు హరితాహారం అని పెద్దలు కేసీఆర్‌(kcr) 230 కోట్లతో కార్యక్రమం చేపట్టగా.. దానికి పోటీగా ఈయన గ్రీన్‌ ఇండియా అని మొదలు పెట్టారన్నారు. తెల్లారి లేస్తే సినిమా వాళ్లను తీసుకురావాలి, ఫోటోలు వేసుకోవాలి అంతే. దానివెనుక ఉన్న కుట్ర ఎందంటే  జీవో అనౌన్స్‌మెంట్‌ అవుతుందని తెలిపారు.10 పర్సెంట్‌ ఇన్‌కం ఇస్తే అమ్యూజ్‌మెంట్‌ పార్కులకు ఇస్తారన్నారు. దానికి చిరంజీవి, ప్రభాస్‌ వంటి అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్లను తీసుకుపోయి వాళ్లతోని పోటోలకు ఫోజులు ఇప్పించుకున్నారన్నారు. తద్వారా ఫారెస్టులను కొట్టేయ్యాలని ప్లాన్‌ అని ఆరోపించారు కవిత.

ఇగ ఆయనకు ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారని ఒకరు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, మరోకరు నవీన్‌కుమార్‌ అన్నారు. శ్రీనివాసరెడ్డిది వరికోల్‌ అనే ఊరు. ఆయనది సామాన్య మధ్యతరగతి కుటుంబం. కానీ ఇప్పడు ఆయనను శ్రీమంతుడు అంటారన్నారు. మోకిలాలలో మేఘా శ్రీనివాసరెడ్డితో కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్టు చేస్తున్నారని తెలిపారు. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయ ని ప్రశ్నించారు. అవినీతి డబ్బులు కాదా?  అని ఎద్దేవా చేశారు. సంతోష్‌రావు క్లాస్‌మెట్‌ తప్పా .. ఆయనకున్న ఆర్హత ఏం లేదు. ఆయనకు ఎమ్మెల్సీ వస్తది, కాంట్రాక్టులు వస్తాయని బాంబ్‌ పేల్చారు. ఈ విషయం పల్లా రాజేశ్వరరెడ్డి అన్ననే చెప్పిండ్రు, డౌట్‌ ఉంటే  ఆయన్నే అడగొచ్చని అన్నారు.

ఇక నవీన్‌ రావు మరో ఎమ్మెల్సీ ఆయన  డైరెక్టుగా మా మోహం పట్టుకుని నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్‌, అయిన నాకు దేవుడు సంతోష్‌ అంటడు. నిన్న మొన్న వాళ్ల నాన్న ను పేకాటల పట్టుకున్నరు. ఏమయింది కేసు నవీన్ రావు పోయి రేవంత్‌ కాళ్లు పట్టుకున్నట్లు తెలిసింది. దీంతో ఆయన తండ్రిని ఇడిసిపెట్టారు. ఆయన మీద భూకబ్జా కేసులు ఉంటే అవి వదిలేశారన్నారు.

ఒక పక్క హరీశ్‌రావు గ్యాంగ్‌, మరోపక్క సంతోష్‌ రావు గ్యాంగ్‌ పైనున్న బీజేపీ(bjp) తో కో ఆర్డినేషన్‌లో ఉండి బీఆర్‌ఎస్‌ పార్టీని జలగల్లాగ పట్టిపీడిస్తున్నారని ఆరోపించారు. నిరంతరం పార్టీకి నష్టం చేస్తున్నారన్నారు. నిజామాబాద్‌లో తనపై కుట్ర చేసి ఓడించారని, కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించారన్నారు. మూడో సారి ప్రభుత్వం ఓడిపోయే వరకు వచ్చిందన్నారు. సంతోష్‌రావు బాధితులు తనకు ఫోన్ చేస్తున్నారని కవిత తెలిపారు. వాళ్లమీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ఇది కూడా చూడండి:Weather Update: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ పొంచి ఉన్న గండం.. వచ్చే నెల నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

Advertisment
తాజా కథనాలు