Mulugu: ఎన్‌కౌంటర్ జరిగిన రాత్రే..వాజేడు ఎస్సై ఆత్మహత్య!

ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ రిసార్ట్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన రాత్రే ఎస్సై సూసైడ్ చేసుకోవటం డిపార్ట్‌మెంట్‌లో కలకలం రేపుతోంది.

New Update
hareesh

ములుగు జిల్లా వాజేడు ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తన సర్వీస్‌ రివాల్వర్‌ తో కాల్చుకుని ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్‌లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఆదివారం ఉదయం ఒంటరిగా వెళ్లిన ఎస్ఐ రాత్రివరకు కూడా రాకపోవడంతో సిబ్బంది చూసినట్లు  తెలిసింది. 

Also Read: ISRO: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

సోమవారం ఉదయం ఫెరిడో రిసార్ట్ సిబ్బంది వెళ్లి చూడగా రూంలో విగత జీవిగా ఎస్సై  కనిపించాడు. దీంతో ఫెరిడో సిబ్బంది విషయాన్ని వెంటనే వాజేడు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. ఎస్సై సూసైడ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కలకలం రేపుతోంది. ఎస్సై హరీష్ ఆత్మహత్యకు ఎన్‌కౌంటర్‌కు ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులు హరీష్ సూసైడ్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: AP: ఒక్క మెసేజ్‌ చేయాలనిపించలేదా..తమ్ముడు అంటూ లోకేష్‌ ఎమోషనల్ ట్వీట్‌

Wazeedu SI Committed Suicide

మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఎస్ఐ హరీష్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలా లేక పని ఒత్తిడి‎తో ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు  చేపట్టారు.

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

ములుగు జిల్లా వాజేడులో ఆదివారం జరిగిన భారీ ఎన్ కౌంటర్‎లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ జరిగిన గంటల వ్యవధిలోనే ఎస్ఐ అనుమానస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి.

Also Read:  AP Rains: ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు

Advertisment
తాజా కథనాలు