/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Terrorists-jpg.webp)
Terrorists in Telugu states
Hyd Terrorist: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ విజయనగరం వేదికగా బాంబు పేలుళ్ల రిహార్సల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సౌదీ అరేబియా నుంచి సమాచారం..
ఈ మేరకు ఇంజినీరింగ్ పూర్తిచేసిన సిరాజ్ ఉద్యోగం వేటలో ఉండగా.. సమీర్ లిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే వీరిద్దరు కొంతకాలంగా అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (అహిం) పేరిట సంస్థను ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిర్ధారించారు. సిరాజ్ నంబర్ 1, సమీర్ 2గా ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు వీరికి సౌదీ అరేబియా నుంచి గుర్తుతెలియని ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ మార్గనిర్దేశం చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు చెప్పారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా వీరితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం సేకరించారు. పక్కా ప్రణాళిక ప్రకారం పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని, ఇప్పటికే ఆన్లైన్ ద్వారా పేలుడు పదార్థాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!
ఇందులో భాగంగానే మే 21 లేదా 22న విజయనగరం పరిసరాల్లో బాంబుపేలుళ్లకు రిహార్సల్స్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలిపారు. కానీ ఇంతలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా కుట్రను భగ్నం చేసినట్లు వెల్లడించారు. ఇక గ్రూప్-2 పరీక్షల కోసం వచ్చిన సిరాజ్.. సమీర్ ను ఈ కుట్రలోకి దించినట్లు నిర్ధారించారు. ఇక విజయనగరంలో పోలీసులు సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్లో సమీర్ను అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారంట్పై విజయనగరం తీసుకెళ్లారు. అనతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం