/rtv/media/media_files/2025/05/13/a6JjwG4jnp77lZF36iRR.jpg)
Terror incident at Hyderabad Airport?
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ఉగ్రవాది పట్టుబడ్డట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఆ ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుంటున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. చాలామంది ఇది నిజమేనని నమ్ముతున్నారు. అయితే దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఫేక్ అని తేల్చిచెప్పారు. ఫ్యాక్ట్ చెక్ ద్వారా దీన్ని నిర్ధరించారు.
Also Read: టర్కీకి బిగ్షాక్.. బాయ్కాట్ టర్కీ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్
Also Read : పాకిస్తాన్కు ఆర్మీ ఆపరేషన్స్ లీక్ చేస్తున్న అధికారి.. దేశం విడిచి వెళ్లిపోవాలన్న కేంద్రం
Terror Incident At Hyderabad Airport
శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల మాక్డ్రిల్ సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని స్పష్టం చేశారు. అధికారులు వెరిఫై చేయనటువంటి ఇలాంటి ఫేక్ వీడియోలు నమ్మొద్దని చెప్పారు. తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్న వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టు కూడా ఇది ఫేక్ వీడియో అని ప్రకటన చేసింది.
Passenger Advisory issued at 12:00 HRS#HYDAirport #ExperienceEpicEveryday #TravelAdvisory #FlightUpdates #Alert #Travel #PassengerSafety #Protocols #RealTimeUpdates #Cooperation #Important #Notice #TravelTips #SafeTravels #FlightStatus #News #Awareness #PassengerInformation… pic.twitter.com/5TUZhHN7Ph
— RGIA Hyderabad (@RGIAHyd) May 13, 2025
Also Read: పాక్ ఎయిర్ బేస్లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి
ఇదిలాఉండగా.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, POKలో తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాక్ మళ్లీ తన దొంగబుద్ధి చూపించింది. భారత్పైకి డ్రోన్స్, మిసైల్స్, ఫైటర్ జెట్లతో దాడులు చేశారు. కానీ ఇండియన్ ఆర్మీ వాటిని తిప్పి కొట్టింది. అలాగే పాక్లోని వివిధ ప్రాంతాల్లో ఎయిర్బేస్లపై దాడులు చేసింది. ఆ తర్వాత భారత్-పాక్ DMGOలు ఫోన్లో మాట్లాడుకోవడం వల్ల ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
Also Read : ఇంట్లో చేపలు పెంచడం వల్ల కలిగే అదృష్టం ఇదే
telugu-news | rtv-news | national-news | shamshabad-airport