/rtv/media/media_files/2025/06/15/Dna9PDkXkyba4kf4ezTR.jpg)
CM Revanth
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూలు కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఫ్రీగా అందించాలనే లక్ష్యంతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్టెక్ సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది.
Also Read: మహారాష్ట్ర పూణెలో కుప్పకూలిన వంతెన పలువురు మృతి.. 25 మంది గల్లంతు
ఏక్ స్టెప్ ఫౌండేషన్, పైజామ్ ఫౌండేషన్, ప్రజ్వల ఫౌండేషన్, ఫిజిక్స్ వాలా, ఎడ్యుకేట్ గర్ల్స్, ఖాన్ అకాడమీ లాంటి గుర్తింపు పొందిన NGO లతో విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలో విద్యా నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలు, స్కీమ్లకు ఆకర్షితులై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తున్న వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ… pic.twitter.com/9zZVQDRxH3
— Telangana CMO (@TelanganaCMO) June 15, 2025
Also Read: ఎంత మూర్కుడివిరా నీవు....భార్యను బాల్కనీ రెయిలింగ్కు వేలాడదీసిన భర్త
ఇక నందన్ నీలేకని ఆధ్వర్యంలోని ఏక్ స్టెప్ ఫౌండేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫ్లాట్ఫామ్తో 540 పాఠశాలల్లో పనిచేస్తోంది.ఇకనుంచి ఈ ఫౌండేషన్ 33 జిల్లాల పరిధిలోని 5 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ బేసిక్స్ను ఈ ఫౌండేషన్ అందించనుంది.
Also Read: నైజీరియాలో దారుణం.. 100 మందిని బంధించి సజీవ దహనం!