/rtv/media/media_files/2025/06/15/5g6USVOqosVuSC4jxi7t.jpg)
Bridge collapses in Pune : మహారాష్ట్ర పూణెలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పుణెలోని కుండమల ప్రాంతంలో వంతెన కుప్పకూలింది. రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత వంతెన కూలిపోయి ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, రక్షణ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
గత నాలుగు రోజులుగా పూణే ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. అందువల్ల ఇంద్రాయణి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఆదివారం సెలవు దినం కావడంతో నది అందాలను వీక్షించేందుకు ఆ వంతెన ప్రదేశానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. వారంతా పాత వంతెనమీదకు చేరి నది జలాలు వీక్షిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాత వంతెన కావడం జనాల బరువు ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక కూలిపోయిందని ప్రాథమికంగా తెలుస్తోంది. కుండమల ప్రాంతం పర్యాటక ప్రాంతంగా విలాసిల్లుతోంది. అయితే ఇక్కడ పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ప్రాంతం ప్రమాదకరమని స్థానికులు చెబుతున్నారు. కానీ వర్షాకాలంలో ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఈ ప్రదేశం పర్యాటకులతో బిజీగా మారిపోతుంది. దానికి తగినట్లు భద్రత చర్యలు తీసుకోకపోవడం, పాత వంతెనను తొలగించకపోవడం వల్లె ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపిస్తున్నారు.