Nigeria: నైజీరియాలో దారుణం.. 100 మందిని బంధించి సజీవ దహనం!

నైజీరియాలో చాలా దారుణం జరిగింది. నైజీరియాలోని సెంట్రల్ బెన్యూ రాష్ట్రంలోని యెలెవాటా గ్రామంలో ముష్కరులు పెద్ద ఎత్తున దాడి చేశారు. ఇందులో 100 మంది దాకా మరణించారు. గదుల్లో బంధించి మరీ సజీవదహనం చేశారు.

New Update
nigeria

shot dead brutal attack in nigeria

నైజీరియాలో దుండుగులు పెద్ద దారుణానికి ఒడిగట్టారు. నైజీరియాలోని సెంట్రల్ బెన్యూ రాష్ట్రంలోని యెలెవాటా గ్రామంపై దాడి చేసి అక్కడి వారందరినీ విచక్షణా రహితంగా చంపేశారు. ఇందులో దాదాపు 100మందికి పైగా మృతిచెందారు. చాలా మంది కనిపించడం లేదు. మరి కొంత మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. శుక్రవారం రాత్రి నుంచి శని వారం తెల్లవారు ఝాము వరకు దుండగులు ఈ మారణకాండను చేశారు. చాలా మందిని గదుల్లోనే బంధించి సజీవ దహనం చేశారు. ముష్కరులు కొంచెం కూడా కనికరం లేకుండా ప్రవర్తించారని చెబుతున్నారు. 

రైతులు, పశువుల కాపరులకు మధ్య గొడవ..

బెన్యూ రాష్ట్రం నైజీరియాలోని మిడిల్ బెల్ట్ లో ఉంది. ఇక్కడ ముస్లింలు, క్రైస్తువులు అధికంగా ఉంటారు. అయితే ఇక్కడ చాలా రోజులుగా భూవివాదం నడుస్తోంది. పశువుల కాపరులకు, రైతులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పశువుల కాపరులు బెన్యూలో ఉ్న భూమిని పశువుల మేత కోసం అడుగుతుండగా..రైతులు మాత్రం వ్యవసాయం చేస్తామంటూ మొండిపట్టుక్కూర్చున్నారు. ఇదే కాకుండా మతపరమైన ఘర్షణలు కూడా ఇక్కడ ఎక్కువే అని చెబుతున్నారు. గత నెలలో కూడా ఇక్కడ గొడవలు జరిగాయని..బెన్యూ రాష్ట్రంలోని గ్వెర్ వెస్ట్ జిల్లాలో అనుమానిత పశువుల కాపరులు దాడి చేసి కనీసం 42 మంది రైతులను చంపారు.  పరిశోధనా సంస్థ SBM ఇంటెలిజెన్స్ ప్రకారం.. 2019 నుండి ఈ హింసాత్మక ఘర్షణల్లో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 22 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలుస్తోంది. 

 

Also Read: USA: ఘనంగా అమెరికా ఆర్మీ డే..కానీ విత్ అవుట్ పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌


  

Advertisment
Advertisment
తాజా కథనాలు