/rtv/media/media_files/2025/03/05/MDPdfIiuZKYNv2bkXk4u.jpg)
Telangana Rangareddy Keshampet resident Praveen dead in US
Crime News: అమెరికా(America)లో దారుణం జరిగింది. కొందరు దుండగులు తెలంగాణ విద్యార్థి ప్రవీణ్పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రవీణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు-రమాదేవి దంపతులకు ఇద్దరు సంతానం. అందులో ఒక కొడుకు ప్రవీణ్(27), కూతురు ఉన్నారు. వీరిలో కొడుకు ప్రవీణ్ కొన్నేళ్ల కిందట ఉన్నత చదువులు చదవాలని అమెరికా వెళ్లాడు. మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ నగరంలో నివాసం ఉంటున్నాడు.
Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్లో 12 మంది..
ఎంఎస్ సెకండ్ ఇయర్
అక్కడే యూనివర్సిటీలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక అక్కడి ఖర్చుల కోసం పార్ట్ జాబ్ కూడా చేస్తున్నాడు. ఓ స్టార్ హోటల్లో పార్ట్ టైంకి జాయిన్ అయ్యాడు. ఇక ప్రవీణ్ నివాసం ఉంటున్న ఇంటి సమీపంలో ఒక బీచ్ ఉంది. అక్కడే కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు.
Also Read : మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
స్పాట్లో మృతి
అనంతరం ఆ గాయాలతో స్పాట్లోనే ప్రవీణ్ మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న అతడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
Also Read : చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?