/rtv/media/media_files/2025/05/05/8vkPJK860zw5sYYAMrdx.jpg)
Tiger
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి బీభత్సం సృష్టించింది. చంద్రపూర్-బల్లార్షా అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజుల నుంచి పులి తిరుగుతోంది. ఐదుగురిపై దాడి చేసి చంపేసింది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
కొన్ని రోజుల కిందట ఉత్తరాఖండ్లో..
ఇదిలా ఉండగా ఇటీవల ఉత్తరాఖండ్లో 'హెర్క్యులస్' అనే అతిపెద్ద పులి సంచరిస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పులి శరీరాన్ని చూసిన వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దాదాపు 300 కిలోలు బరువు, 7 అడుగుల పొడవుతో గంభీరంగా కనిపించింది. దీంతో ఆసియాలోనే ఇది అతి పెద్ద పులి అయి ఉండవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI
ఈ పులిని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ పరిధిలోని ని ఫాటో టూరిజం జోన్లో గమనించారు. అక్కడ పులులు, చిరుతలు, ఏనుగులు వంటి అనేక వన్యజీవులు జీవిస్తాయి. కొన్ని దశాబ్దాల తరువాత భారత అడవుల్లో కనిపించిన ఇంత పెద్ద పులి ఇదే కావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చూడండి: పాకిస్థాన్ కిరానా హిల్స్లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!
ఇంత పెద్ద, బలమైన హెర్క్యూలీస్ పులి ఒకప్పుడు భారతదేశం అంతటా విస్తరించి ఉండేది. కానీ ఇప్పుడు అటవీ ప్రాంతాలు తగ్గిపోవడంతో ఈ పులుల సంఖ్య చాలా తగ్గిపోయింది. అడవుల్లో ఈ పులులు కనిపించడమే కనుమరుగైంది.