/rtv/media/media_files/2025/06/06/AVCWumMyGVjS8527fQYX.jpg)
Telangana Local Body Elections
స్థానిక ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. జూన్ ఆఖరిలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపై కొంతసేపు సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే జూన్ 15న మరోసారి మంత్రివర్గ సమావేశం ఉంటుందని.. ఈ భేటీలో పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే రేవంత్ సర్కార్ ఎన్నికలు నిర్వహిస్తుందనే ప్రచారం కూడా నడుస్తోంది.
Also Read: కుమార్తెను వేధిస్తున్నాడని.. బాలుడిని కొట్టి కొట్టి హత్య
ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్రంలో మొత్తం12,633 పంచాయతీలు ఉన్నాయి. వాటన్నింటికి ఎన్నికలు జరుగుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ పంచాయతీలన్నింటిలో సుమారు 1,13,500కుపైగా వార్డులున్నాయి. కాగా కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో కలిసే అవకాశం ఉంది. ఆ పంచాయతీల్లోని వార్డులుపోగా.. మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
Also Read: భారత్లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
మరోవైపు 5,817 ఎంపీటీసీ, 567 ఎంపీపీ, 567 జడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. జడ్పీటీసీ ఎన్నికలు ముగియగానే హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మినహా మిగిలిన 31 జిల్లాల్లో జడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియనంత ఆగస్టులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం జులై లేదా ఆగస్టు లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: సినిమా కాదు రియల్.. ఒకేసారి 10మందిని మింగేయగల భారీ అనకొండ!
telugu-news | elections | rtv-news | local-body-elections