రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు లైన్ క్లియర్ అయ్యింది. కొత్త దరఖాస్తులకు అప్లై చేసుకోవాలనుకునే వారికి మే నెలా కోటాను కూడా విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 కోట్ల మంది రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న అన్ని పనులను కూడా క్లియర్ చేశారు. దాదాపుగా 20 శాతం పెండింగ్ దరఖాస్తులను పరిష్కారం చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొత్త సభ్యులను చేర్చడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో రెండు రకాలుగా రేషన్ కార్డును జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చూడండి: Hyderabad Theft Incident: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!
మెట్రో కాంబో టికెట్ను..
ఇదిలా ఉండగా ఇటీవల టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో ప్రయాణిస్తున్న జనరల్ బస్ పాస్ ప్రయాణికులకు తీపికబురు చెప్పింది. ఎక్స్ప్రెస్, ఆర్డినరీ మంత్లీ బస్ పాస్ హోల్డర్లు అన్ని మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించడానికి వీలుగా ‘మెట్రో కాంబి టికెట్’ను పరిచయం చేసింది. దీని ద్వారా రూ.20 టికెట్ తీసి బస్ పాస్ కలిగిన ఎవరైనా మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కల్పించింది.
ఇది కూడా చూడండి: Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
దీంతో మెట్రో బస్పాస్, జనరల్ బస్పాస్, నెలవారీ బస్ పాస్ ఉన్నవారు హైదరాబాద్ అంతటా మెట్రో డీలక్స్ బస్సుల్లో చక్కర్లు కొట్టొచ్చు. దీనిని టీజీఎస్ఆర్టీసీ తక్షణమే అమలులోకి తీసుకురానుంది. సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ మంత్లీ బస్ పాస్ హోల్డర్లు ప్రతి ట్రిప్కు రూ. 20 లతో కాంబి టికెట్ కొనుగోలు చేసి అన్ని మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించొచ్చు.
ఇది కూడా చూడండి:Pending Traffic Challan: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు
ఇది కూడా చూడండి: Hyderabad School Buses: డేంజర్ జోన్లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!