/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-22T162538.691.jpg)
Telangana Group-1
TGPSC: తెలంగాణ గ్రూప్- 1 ఉద్యోగాలపై జరుగుతున్న ప్రచారంపై TGPSC స్పందించింది. 'అమ్మకానికి టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులు' అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నది అసత్య ప్రచారమని తెలిపింది. దీనిని ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అమ్మకానికి టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులు?
— Telugu Scribe (@TeluguScribe) March 4, 2025
గ్రూప్ 1 ఫలితాల ఆలస్యం వెనుకాల అమ్మకాలు ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు
ఒక్కో పోస్ట్ కి 4 కోట్ల వరకు పలుకుతుంది అంటూ నెట్టింట చర్చ పెడుతున్న అభ్యర్థులు
అడుగడుగునా అనుమానం వచ్చేలా గ్రూప్ 1 పరీక్షని నిర్వహించిన… pic.twitter.com/bMF6GWI6Lb
పారదర్శకంగానే నియామక ప్రక్రియ..
ఈ మేరకు త్వరలోనే గ్రూప్- 1 ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. మార్కుల జాబితాను వెబ్సైట్లో పెట్టనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థుల లాగిన్లో పేపర్ల వారీగా మార్కుల లిస్ట్ అప్ లోడ్ చేయనున్నట్లు పేర్కొంది. గ్రూప్ -1 నియామక ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుదని, ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అభ్యర్థులు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించింది.
Also read : సింగర్ కల్పన ఆత్మహత్యకు అదే కారణం.. షాకింగ్ విషయాలు
అసలేం జరిగిందంటే..
తెలంగాణలో గ్రూప్ -1 పోస్టులు అమ్ముకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఒక్కో పోస్ట్ కు రూ. 4 కోట్ల డిమాండ్ చేస్తున్నారని, వేరు వేరు హాల్ టికెట్లు ఇవ్వడం వెనక రహస్యం అదేనంటూ ప్రచారం జరుగుతోంది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరిగి ఇప్పటికి 5 నెలలు గడిచింది. ఇప్పటి వరకు ఫలితాల మీద ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పడిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రద్దు చేసి గత ఏడాది ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకు సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్ లో జరగగా, మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్ చివర్లో నిర్వహించారు. మెయిన్స్ పరీక్షలు పూర్తయ్యి దాదాపు 5 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఫలితాలు విడుదల చేయకపోవడం పై మెయిన్స్ రాసిన అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also read : చైనా AI డీప్సీక్ కారణంగా మస్క్కు 90 బిలియన్ డాలర్ల నష్టం