CM Revanth: భారత్-పాక్ యుద్ధం.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక పిలుపు!

భారత్-పాక్ యుద్ధం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నేల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇతర పార్టీల నాయకులు కూడా ముందుకు రావాలని సీఎం రేవంత్, భట్టివిక్రమార్క కోరారు. 

New Update
cm-revanth-op-sindoor

Telangana government donate to National Defense Fund

CM Revanth: భారత్-పాక్ యుద్ధం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నేల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని ఇతర పార్టీల నాయకులు కూడా ముందుకు రావాలని సీఎం రేవంత్, భట్టివిక్రమార్క కోరారు. 

జై హింద్ .. జై భారత్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి సూచనల మేరకు ఎమ్మెల్సీ గా వచ్చే నా మొదటి నెల వేతనాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. భారత సైన్యానికి అండగా నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని తెలంగాణ ముఖమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అన్ని పార్టీల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించి మన సంఘీభావాన్ని త్రివిధ దళాలకు తెలుపుద్దాం నా జీవితం లో ప్రజాప్రతినిధిగా మొదటి జీతాన్ని జాతీయ రక్షణ నిధికి ఇవ్వడం నాకు గర్వం గా ఉంది అదృష్టంగా భవిస్తున్నాను. డాక్టర్ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ, తెలంగాణ

Posted by Dr Addanki Dayakar on Friday, May 9, 2025

భారత సైన్యానికి అండగా

ఈ మేరకు దాయాదితో వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి విరాళాన్ని పంపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పారు. ప్రజాప్రతినిధిగా తన మొదటి జీతాన్ని దేశంకోసం పోరాటం చేస్తున్న జవాన్ల నిధికి అందించడం చాలా గర్వంగా ఉందన్నారు. 

Also Read: 'నాన్న అమ్మకు చెప్పకు.. నన్ను వెళ్ళనివ్వదు'.. వ్యోమికా సింగ్ సక్సెస్ స్టోరీ ఇదే!

టోల్ ఫ్రీ నెంబర్..

అలాగే సరిహద్దు రాష్ట్రాల్లో నివాసం ఉండే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పాక్-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుతం నివసిస్తున్న,చిక్కుకున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించడం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఈ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా సేవలను అందించడానికి ఈ కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పని చేయనుంది. ఈ మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్  రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ ప్రకటన విడుదల చేశారు.

Also Read: ఐదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ప్రశంసలు అందుకున్న సోఫియా ఖురేషీ.. సంచలన తీర్పు!

telangana | funds | india-military | today telugu  today telugu news

Advertisment
Advertisment
తాజా కథనాలు