Telangana: నేటి నుంచి తెలంగాణ బోనాలు..!

తెలంగాణలో నేటి నుంచి బోనాల జాతర ప్రారంభం కానుంది. ఈ బోనాలకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. తెలంగాణలో మొదటి బోనం గోల్కొండ కోటపై ఉన్న జగదాంబికా అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తర్వాత బల్కంపేట రేణుకా ఎల్లమ్మకి ఇస్తారు.

New Update
Bonalu

తెలంగాణలో నేటి నుంచి బోనాల జాతర ప్రారంభం కానుంది. ఈ బోనాలకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. తెలంగాణలో మొదటి బోనం గోల్కొండ కోటపై ఉన్న జగదాంబికా అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తర్వాత బల్కంపేట రేణుకా ఎల్లమ్మకి ఇస్తారు. అయితే కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్‌

ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్‌

ఆనవాయితీగా మెట్ల పూజ..

ఇక అప్పటి నుంచి ఈ బోనాల పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గోల్కొండ అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలు, బోనం సమర్పిస్తారు. గోల్కొండలో మొదటి బోనాలు ప్రారంభ కావడంతో కోటకు ఉన్న 385 మెట్లకు బుధవారం పసుపు, కుంకుమ పెట్టి పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు ముందు తప్పకుండా మెట్ల పూజ ఆనవాయితీగా వస్తోంది.

ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు