/rtv/media/media_files/2025/06/02/tBxSHxcGYM4TonaJx92q.jpg)
Telangana formation celebrations Japan special guest at
TG News: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల కవాతు అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసులకు మెడల్స్ అందజేశారు.
2047 నాటికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు తెలిపారు. ఈ క్రమంలో పారదర్శకమైన పరిపాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నడిపించడానికి ప్రజలందరూ ప్రజా… pic.twitter.com/zsCCu6mWHY
— Telangana CMO (@TelanganaCMO) June 2, 2025
కితాక్యూషూ సిటీతో ఒప్పందాలు..
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఫారెన్ నుంచి స్పెషల్ గెస్ట్ రావడం చర్చనీయాంశమైంది. జపాన్ నుంచి ఒక ప్రత్యేక అతిథి బృందం హైదరాబాద్ రాగా.. జపాన్లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ ప్రతినిధి బృందం పరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కితాక్యూషూ సిటీతో పరస్పర సహకార ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు కితాక్యూషూ సిటీని సందర్శించిన విషయం తెలిసిందే. కాగా ఇందులో భాగంగానే రాష్ట్ర ఆవిర్భవ వేడుకలకు వచ్చినట్లు సమాచారం.
Also Read: సెక్స్ వర్కర్లలో తెలుగు స్టేట్స్ టాప్.. HIV కేసుల్లో ఇండియా నెం3!
'మిషన్ 26 డేస్'
గతంలో అత్యంత కాలుష్యం నగరంగా కితాక్యూషూ ఉండేది. గాలి, నీరు, నేల విషపూరితంగా మారాయి. కానీ ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. హైదరాబాద్ నగరంలో కూడా కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా కీలక ఎంవోయూలు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ప్రత్యేకంగా 'మిషన్ 26 డేస్' పేరుతో కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తోంది.
Also Read: ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టి.. కాళ్లు పట్టుకున్న మహిళ - వీడియో వైరల్
telangana-formation-day | japan | cm-reavanth-reddy | today telugu news