/rtv/media/media_files/2025/06/28/telangana-filling-the-posts-of-assistant-professors-in-universities-2025-06-28-11-02-18.jpg)
telangana filling the posts of assistant professors in universities
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయ్యాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు సంబంధించి తాజాగా నాలుగు వర్సిటీల పాలకమండళ్లు ఆమోదం తెలిపాయి. కాకతీయ వర్సిటీలో 145, శాతవాహనలో 3, ఓయూలో 250, పాలమూరులో 8 పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. మరికొద్ది రోజుల్లో మిగిలిన 8 వర్సిటీలూ అదే దిశగా అడుగులు వేయనున్నట్లు సమాచారం.
Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!
telangana assistant professor jobs
అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. వీటిల్లో 15 ఏళ్లకుపైగా పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మాత్రం ఎప్పటిలాగే కొనసాగనున్నారు. మిగిలి ఉన్న ఖాళీలను మాత్రమే భర్తీ చేయనున్నారు. ఇదే క్రమంలో ఆయా వర్సిటీలు రిజర్వేషన్లను పాటించేందుకు రోస్టర్ పాయింట్లు రూపొందించనున్నాయి. ఆ తర్వాత దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నాయి.
Also Read: కోల్కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి కనీసం రెండు, మూడు నెలలు అయినా పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో.. కాకతీయ వర్సిటీలో 145, శాతవాహనలో 3 పోస్టుల భర్తీకి ఆమోదం పొందాయి. ఇందులో భాగంగానే శాతవాహన వర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్, లా కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేస్తుండటంతో.. మరో 68 టీచింగ్ పోస్టులు మంజూరయ్యాయి.
Also Read : జపాన్లో ‘ట్విటర్ కిల్లర్’ కు ఉరి
ఇలా 3 రోజుల క్రితం ఓయూ, పాలమూరు వర్సిటీల సమావేశాలు నిర్వహించారు. ఈ మేరకు OUలో 250, పాలమూరులో 8 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. డిసెంబరు 31 నాటికి వర్సిటీల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకునే విషయానికొస్తే.. మొత్తం 2,878 మంజూరు పోస్టులు ఉండగా.. అందులో పనిచేస్తున్న వారు 753గా ఉన్నారు. దీంతో 2,125 ఖాళీలు మిగిలి ఉన్నాయి.