Telangana: సర్పంచ్ ఎన్నికలు.. ఈసీ కీలక అప్‌డేట్

తెలంగాణలో మొదటి దశ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికలసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియను మరింత సజావుగా నిర్వహించేందుకు టీ పోల్‌ మొబైల్ అనే యాప్‌ను ప్రారంభించింది.

New Update
Telangana Election Commission launches grievance portal for local polls

Telangana Election Commission launches grievance portal for local polls

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. గురువారం మొదటి దశ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల సంఘం(election-commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియను మరింత సజావుగా నిర్వహించేందుకు టీ పోల్‌ మొబైల్ అనే యాప్‌(T-Poll Mobile App)ను ప్రారంభించింది. దీనిద్వారా ఓటర్ల పోలింగ్ స్టేషన్‌ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అందులో ఈసీకి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.   

Also Read: నన్ను గెలిపిస్తే ఎకరం పొలం, ఇంటింటికీ మినరల్ వాటర్.. సర్పంచా.. మజాకా

Telangana EC Launches Grievance Portal

దీనివల్ల ఓటర్లు తమ ఓటరు స్లిప్‌, పోలింగ్ స్టేషన్ వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదులు కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చని ఈసీ ప్రకటనలో తెలిపింది. ఈ యాప్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉందని పేర్కొంది. ఇదిలాఉండగా డిసెంబర్ 11,14,17 తేదీల్లో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 

Also read: పొలంలో రూ.500 నోట్లు నాటిన రైతు.. ఎందుకిలా చేశాడంటే ?

Advertisment
తాజా కథనాలు