జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్న అందరికీ అభినందనలు తెలిపారు. ఇది మీకు కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. ఒక భావోద్వేగమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర క్రియాశీలకమైందన్నారు. కానీ గత ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధి చూపలేదని ఫైర్ అయ్యారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో నిరుద్యోగుల కృషి, పట్టుదల ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగుల జీవితంలో పన్నెండేళ్ళు వృథా అయిందని ఫైర్ అయ్యారు. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55,163 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాదిగా మారిన నిరుద్యోగుల సమస్యకు తాము శాశ్వత పరిష్కారం చూపామన్న సంతృప్తి ఉందన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందన్నారు. దేశ ఆర్థిక భవిష్యత్ విద్యాశాఖతో ముడిపడి ఉందన్నారు. అలాంటి శాఖలో మీరు ఉద్యోగ నియామక పత్రాలు అందుకోవడం గొప్ప విషయమన్నారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : సబ్జెక్ట్ నేర్చుకుంటేనే రేపు భవిష్యత్తు...లేదంటే ఇంటికే.. ఆ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్
విద్యాశాఖను ప్రక్షాళన చేశాం
ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు, పదోన్నతుల సమస్యను పరిష్కరించి విద్యాశాఖను ప్రక్షాళన చేశామన్నారు. విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే విద్య ప్రమాణాలు పెంచేందుకు మీరంతా ఒక భావోద్వేగంతో విధులు నిర్వర్తించాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలని సూచించారు. విద్యార్థులపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. అది వారి భవిష్యత్ కు పెట్టుబడి అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో మూలాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Padi Kaushik Reddy : నా ప్రాణం పోయినా కేసీఆర్ వెంటే...పాడి కౌశిక్ రెడ్డి కీలక కామెంట్స్
ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెంచేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మించబోతున్నామన్నారు. ఇటీవలే 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం రూ.11,000 కోట్లు కేటాయించామన్నారు. విద్యార్థి, నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోందన్నారు. క్రికెట్ లో రాణించిన సిరాజ్ కోసం నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చామన్నారు. బాక్సింగ్ లో రాణించిన నిఖత్ జరీన్ కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామన్నారు. పారాలింపిక్స్ లో రాణించిన దీప్తి జీవాంజీకి ఇంటి స్థలంతో పాటు ఉద్యోగం ఇచ్చామన్నారు.
కొంతమంది స్ట్రేచర్.. స్ట్రేచర్.. అని మాట్లాడుతున్నారన్నారు. స్ట్రేచర్ ఉందని విర్రవీగినవారు స్ట్రెచ్చర్ మీదకు వెళ్లారన్నారు. స్ట్రేచర్ అనేది స్థానానికి తప్ప వ్యక్తులకు ఉండదన్నారు. కేసీఆర్ తమకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులు మాత్రమేనన్నారు. ప్రతీ నెలా రూ. 6500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే సరిపోతుందన్నారు. రాష్ట్రానికి కెసిఆర్ ఆర్థికంగా క్యాన్సర్ ఇచ్చారన్నారు. క్యాన్సర్ ముదురుతుంటే రాష్ట్రం దివాళా తీసిందంటారా? అని అంటున్నారన్నారు. వాస్తవాన్ని ఎన్నాళ్ళు దాచిపెడతారు? అని ప్రశ్నించారు. తాను వాస్తవాలు చెబుతుంటే… దిగిపో దిగిపో అని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ లా అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. అబద్ధాల ప్రాతిపదికన తాను రాష్ట్రాన్ని నడపనన్నారు. వాస్తవాలు పంచుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
CM Revanth: కేసీఆర్ మాకు వారసత్వంగా ఏం ఇచ్చాడో తెలుసా?: రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
KCR తమకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులు మాత్రమేనని సీఎం రేవంత్ అన్నారు. తాను వాస్తవాలు చెబుతుంటే… దిగిపో అని అంటున్నారని ఫైర్ అయ్యారు. JL, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్న అందరికీ అభినందనలు తెలిపారు. ఇది మీకు కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. ఒక భావోద్వేగమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర క్రియాశీలకమైందన్నారు. కానీ గత ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధి చూపలేదని ఫైర్ అయ్యారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో నిరుద్యోగుల కృషి, పట్టుదల ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగుల జీవితంలో పన్నెండేళ్ళు వృథా అయిందని ఫైర్ అయ్యారు. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55,163 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాదిగా మారిన నిరుద్యోగుల సమస్యకు తాము శాశ్వత పరిష్కారం చూపామన్న సంతృప్తి ఉందన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందన్నారు. దేశ ఆర్థిక భవిష్యత్ విద్యాశాఖతో ముడిపడి ఉందన్నారు. అలాంటి శాఖలో మీరు ఉద్యోగ నియామక పత్రాలు అందుకోవడం గొప్ప విషయమన్నారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : సబ్జెక్ట్ నేర్చుకుంటేనే రేపు భవిష్యత్తు...లేదంటే ఇంటికే.. ఆ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్
విద్యాశాఖను ప్రక్షాళన చేశాం
ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు, పదోన్నతుల సమస్యను పరిష్కరించి విద్యాశాఖను ప్రక్షాళన చేశామన్నారు. విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే విద్య ప్రమాణాలు పెంచేందుకు మీరంతా ఒక భావోద్వేగంతో విధులు నిర్వర్తించాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలని సూచించారు. విద్యార్థులపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. అది వారి భవిష్యత్ కు పెట్టుబడి అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో మూలాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Padi Kaushik Reddy : నా ప్రాణం పోయినా కేసీఆర్ వెంటే...పాడి కౌశిక్ రెడ్డి కీలక కామెంట్స్
ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెంచేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మించబోతున్నామన్నారు. ఇటీవలే 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం రూ.11,000 కోట్లు కేటాయించామన్నారు. విద్యార్థి, నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోందన్నారు. క్రికెట్ లో రాణించిన సిరాజ్ కోసం నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చామన్నారు. బాక్సింగ్ లో రాణించిన నిఖత్ జరీన్ కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామన్నారు. పారాలింపిక్స్ లో రాణించిన దీప్తి జీవాంజీకి ఇంటి స్థలంతో పాటు ఉద్యోగం ఇచ్చామన్నారు.
కొంతమంది స్ట్రేచర్.. స్ట్రేచర్.. అని మాట్లాడుతున్నారన్నారు. స్ట్రేచర్ ఉందని విర్రవీగినవారు స్ట్రెచ్చర్ మీదకు వెళ్లారన్నారు. స్ట్రేచర్ అనేది స్థానానికి తప్ప వ్యక్తులకు ఉండదన్నారు. కేసీఆర్ తమకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులు మాత్రమేనన్నారు. ప్రతీ నెలా రూ. 6500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే సరిపోతుందన్నారు. రాష్ట్రానికి కెసిఆర్ ఆర్థికంగా క్యాన్సర్ ఇచ్చారన్నారు. క్యాన్సర్ ముదురుతుంటే రాష్ట్రం దివాళా తీసిందంటారా? అని అంటున్నారన్నారు. వాస్తవాన్ని ఎన్నాళ్ళు దాచిపెడతారు? అని ప్రశ్నించారు. తాను వాస్తవాలు చెబుతుంటే… దిగిపో దిగిపో అని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ లా అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. అబద్ధాల ప్రాతిపదికన తాను రాష్ట్రాన్ని నడపనన్నారు. వాస్తవాలు పంచుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.