BIG BREAKING : రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం..స్థానిక సంస్థల ఎన్నికల పై కీలక నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం సోమవారం క్యాబినెట్‌ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

New Update
Telangana cabinet meeting

Telangana cabinet meeting

Telangana Cabinet meeting : స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం సోమవారం క్యాబినెట్‌ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ విషయమై ఇప్పటికే కొంత స్పష్టత ఇచ్చారు. ఈ నెలాఖరున నోటీఫికేషన్‌ ఇచ్చి జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనిఆయన తెలిపారు. గత సమావేశంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి క్యాబినెట్‌ సమావేశం నిర్వహించాలని తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సోమవారం నిర్వహించనున్నారు.

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గత క్యాబినెట్‌ సమావేశంలో  నిర్ణయం తీసుకుంది. అయితే సమయం సరిపోయే అవకాశం లేకపోవడంతో ఈ నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చి వచ్చే నెలలో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సమావేశంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై క్యాబినెట్‌ సమాలోచనలు చేసింది. వర్షాకాలం నేపథ్యంలో జూన్ -జులై లో  పంచాయతీ ఎన్నికల  నిర్వహణ ఏ మేరకు సురక్షితం అన్నదానిపై క్యాబినెట్‌ చర్చించింది. ఇప్పటికే ఆలస్యం అయిందని.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కొందరు మంత్రులు కోరగా, వర్షాకాలం నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని మరి కొందరు మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే సోమవారం జరగనున్న సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Also read: మణిపూర్‌ వెపన్స్‌ ఆఫరేషన్‌..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం

ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి ముందు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా వర్షాకాల రైతుభరోసా పై ఒక నిర్ణయం తీసుకోనుంది. వీలయినంత త్వరగా ఎన్నికల లోపు రైతులందరికీ రైతుభరోసా చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఎన్నికలు ఏక్షపక్షంగా జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.  ఇక ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా క్యాబినెట్‌ చర్చించే అవకాశం ఉంది.

Also Read: ఇజ్రాయిల్ అంతు చూసేందుకు.. ఇరాన్ వద్ద ఉన్న 5 పవర్ ఫుల్ వెపన్స్ ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు