Uttam Kumar Reddy and Bhatti Vikramarka In Delhi | ఆ శాఖలు మాకే | Telangana Cabinet | Rahul | RTV
MLC ఎన్నికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్లో ఓటమికి కారణం పార్టీలో సమన్వయలేకపోవడమని నిర్ణారించారు. సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని మంత్రులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
పలు కీలక అంశాలపై చర్చించేందుకు మార్చి6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నది. రెండో దఫా గణాంకాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.
ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల వరదల కారణంగా జరిగిన నష్టం, నామినేటెడ్ పోస్టుల బర్తీ, రుణ మాఫీ అమలులో సమస్యలు, రైతు భరోసా రూల్స్ అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ఈ నెల 21 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రి మండలి మ. 3 గంటలకు సమావేశం కానుంది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఈసీ కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే. పంట నష్టం, విద్యా సంవత్సరం ఆరంభం, కాళేశ్వరం మరమ్మతుల అంశాలపై కేబినెట్లో చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.