/rtv/media/media_files/2025/06/05/VN2J7fw4joSQl5YHKxhM.jpg)
క్రికెట్ ప్రియులకు పిచ్చి ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. తమ అభిమాన జట్టు గెలిస్తే.. ఆ ఆనందంలో ఏం చేస్తారో వారికే అర్థం కాదు. ఏవోవో ఛాలెంజ్లు చేసి వైరల్ అవుతుంటారు. ఇప్పటికి ఎంతో మంది అలాంటి ఛాలెంజ్లు చేసి బాగా ఫేమస్ అయ్యారు. గతంలో భారత్ ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతా అంటూ ఎంతో మంది ఛాలెంజ్ చేశారు.
ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు
ఆర్సీబీ గెలస్తే సగం గుండుతో
ముఖ్యంగా బాలీవుడ్లో ఈ ఛాలెంజ్లు బాగా వినిపించాయి. అది మాత్రమే కాకుండా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ గెలిస్తే.. వైజాగ్ బీచ్లో బట్టలు లేకుండా తిరుగుతానని టాలీవుడ్ హీరోయిన్ రేఖ భోజ్ అప్పట్లో ఛాలెంజ్ చేసి వైరల్గా మారింది. తాజాగా అలాంటి ఇన్సిడెంటే ఒకటి తెలంగాణలో చోటుచేసుకుంది.
ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు
ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ vs ఆర్సీబీ మధ్య మ్యాచ్కు ముందు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్కు చెందిన ఓ యువకుడు ఛాలెంజ్ చేశాడు. ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ కప్పుకొడితే తాండూరు బస్స్టాండ్ మొత్తం అరగుండు కొట్టుకుని, మెడలో చెప్పుల దండతో తిరుగుతానని ఓ వీడియో రిలీజ్ చేశాడు.
ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!
దీంతో ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ ఘనవిజయం సాధించి కప్పు కొట్టడంతో ఆ యువకుడు ఛాలెంజ్ నిలబెట్టుకున్నాడు. తాను విసిరిన ఛాలెంజ్ను నిలబెట్టుకునే సమయం వచ్చిందని తెలిపాడు. ఈ మేరకు అరగుండు కొట్టించుకుని.. మెడలో చెప్పుల దండ వేసుకుని తాండూరు బస్ స్టాండ్ మొత్తం తిరిగాడు. అందుకు సంబంధించిన వీడియో సంచలనంగా మారింది.