/rtv/media/media_files/2024/10/30/UpUkx4fW72k9096Bj33Z.jpg)
Hydra Ranganath fire on Hayatnagar CI for land issue
Hydra: హైదరాబాద్ హయత్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహెడ సర్వే నెంబర్ 951,952లో వివాదాస్పద భూమిని పరిశీలించేందుకు వెళ్లిన రంగనాథ్.. ఆ భూమిలో మారణాయుధాలను చూసి షాక్ అయ్యారు. ఆ స్థలం కొనుగోలుదారులకు, ఫాంహౌస్ యజమానికి మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తున్నట్లు తెలిసింది.
Also Read : పాకిస్థాన్ నుంచి తిరిగొచ్చిన భర్త.. గుర్తుపట్టలేకపోయానంటూ భార్య ఎమోషనల్
యజమానులపై మారణాయుధాలతో దాడి
దీంతో ప్లాటు యజమానులపై మారణాయుధాలతో దాడి చేస్తే, హత్యయత్నం కేసు పెట్టకుండా ఏం చేస్తున్నారని సీఐని ప్రశ్నించారు. మీ కొనుగోలు చేసిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఇలాంటి సమస్యల కోసమే హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేశామని, ఇది బాధితులకు భరోసా ఇస్తుందని బాధితులు, స్థానికులకు వివరించారు. ఏదైనా భూ వివాదం, కంప్లైంట్ ఉంటే హైడ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Also read : Miss World Competition : మిస్ వరల్డ్ పోటీలు..మన దేశం నుంచి పాల్గొనే అందాల భామ ఎవరంటే?
హైదరాబాద్(Hyderabad) నగరంలో కొత్తగా ఏర్పాటైన హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించేందుకు ఈ ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 9న దీనిని అధికారికంగా ప్రారంభించారు. ప్రత్యేకంగా నియామకాలు, నిపుణుల బృందంతో ఇతర పోలీస్ స్టేషన్లకు అతీతంగా పనిచేసే ఈ ప్రత్యేక శాఖలో ఒక ఏసీపీ, ఆరు ఇన్స్పెక్టర్లు, పన్నెండు ఎస్ఐలు, ముప్పై మంది కానిస్టేబుళ్లను నియమించారు. ఇందులో వనరుల వినియోగాన్ని మరింత పెంచేందుకు సుమారు 70కి పైగా వాహనాలు, అందులో 40 స్కార్పియోలు, 20 డీసీఎంలు, బైక్స్, టిప్పర్లు తదితర రకాల వాహనాలను హైడ్రా తన సేవలోకి తీసుకుంది.
Also Read : కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం..!
av ranganath | telugu-news | today telugu news