/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
Rains
తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. గురువారం ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
Also Read: యాక్సియమ్-4 మిషన్ సక్సెస్.. ISSతో డాకింగ్ అయిన స్పేస్క్రాఫ్ట్
ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. అరేబియన్ సముద్ర తీర ప్రాంతం నుంచి ద్రోణి దక్షిణ గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా వాయువ్య బంగాళఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతోనే మూడు రోజుల పాటు ఉరములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది.
Also Read: కాల్పుల విరమణ జరిగినా బయటకు రాని ఖమేనీ.. హత్యకు ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్ !